అనుమానంతో భార్యను తెగ నరికి హత్య చేసిన భర్త
కుమారుడు, కోడలు సంపాదిస్తుండడంతో సుబ్బారెడ్డి కూల్ డ్రింక్ షాపు మూసేశాడు. సుబ్బారెడ్డి నుంచి పోలీసులు రాబట్టిన విషయాల ప్రకారం - సుబ్బారెడ్డి ఎప్పటిలాగే ఆదివారంనాడు గొంతు దాకా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. భార్య వడ్డించిన ఆహారం బోంచేశాడు. ఆ తర్వాత దంపతుల మధ్య వివాదం చోటు చేసుకుంది. భార్యపై అనుమానం ఉన్న సుబ్బారెడ్డి ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడే నిద్రపోయాడు
ఆదివారం నుంచి ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి ఇంటి తలుపు తెరిచారు. చూసే సరికి పద్మావతి శవమై పడి ఉంది. వెంకట సుబ్బారెడ్డి కనిపించలేదు. దాంతో వారు గాలించి వెంకటసుబ్బారెడ్డిని వెతికి పట్టుకున్నారు. ఆదివారం రాత్రి భార్యను హత్య చేసిన తర్వాత నిద్రపోయిన సుబ్బారెడ్డి సోమవారం కూడా అదే మత్తులో పడుకున్నాడు. మంగళవారం మెలుకువ వచ్చింది. వెంటనే ఇంటికి తాళం వేసి ఉడాయించాడు. ప్రస్తుతం సుబ్బారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.