చిదంబరానివి దొంగ మాటలు: తెలంగాణపై నామా

Nama Nageswar Rao
న్యూఢిల్లీ: తెలంగాణపై కేంద్ర హోం మంత్రి దొంగ మాటలు చెబుతున్నారని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు అన్నారు. తెలంగాణ అంశంపై లోకసభ వాయిదా పడిన తర్వాత ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై తాము ఇచ్చిన నోటీసుపై చర్చకు స్పీకర్ అనుమతి ఇవ్వలేదని, దాంతో లోకసభను స్తంభింపజేశామని ఆయన చెప్పారు. సమస్యను పరిష్కరించడం చేతకాక చిదంబరం ద్వంద్వ వైఖరిని ఆవలంబిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉందని, అందువల్ల నిర్ణయం తీసుకునే బాధ్యత కాంగ్రెసు పార్టీదేనని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రజలకు కాంగ్రెసు తీరని అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో యువకులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం సంతాపం కూడా తెలుపని స్థితిలో లోకసభ ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలపై కేంద్ర ప్రభుత్వానికి కనికరం లేదని ఆయన అన్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని పార్లమెంటు తెలంగాణ విద్యార్థులకు, యువకులకు విజ్ఞప్తి చేయవచ్చు కదా అని ఆయన అన్నారు. 1969లో చెన్నారెడ్డితో కలిసి ఇందిరా గాంధీ తెలంగాణ ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు సోనియా గాంధీ మోసం చేస్తున్నారని ఆయన అన్నారు.

తెలంగాణ అంశాన్ని పట్టించుకోకపోవడంపై ఆయన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిపై కూడా ధ్వజమెత్తారు. తెలంగాణ ఓట్లతో గెలిచి మంత్రి పదవి చేపట్టిన జైపాల్ రెడ్డి తెలంగాణపై ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు కూడా విలువ లేకుండా పోయిందని ఆయన అన్నారు. కాంగ్రెసు ద్వంద్వ వైఖరి వల్లనే తెలంగాణ రావడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసుకు తెలంగాణ ప్రజల ఉసురు తగులుతుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+