చిదంబరానివి దొంగ మాటలు: తెలంగాణపై నామా

తెలంగాణ ప్రజలకు కాంగ్రెసు తీరని అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో యువకులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం సంతాపం కూడా తెలుపని స్థితిలో లోకసభ ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలపై కేంద్ర ప్రభుత్వానికి కనికరం లేదని ఆయన అన్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని పార్లమెంటు తెలంగాణ విద్యార్థులకు, యువకులకు విజ్ఞప్తి చేయవచ్చు కదా అని ఆయన అన్నారు. 1969లో చెన్నారెడ్డితో కలిసి ఇందిరా గాంధీ తెలంగాణ ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు సోనియా గాంధీ మోసం చేస్తున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ అంశాన్ని పట్టించుకోకపోవడంపై ఆయన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిపై కూడా ధ్వజమెత్తారు. తెలంగాణ ఓట్లతో గెలిచి మంత్రి పదవి చేపట్టిన జైపాల్ రెడ్డి తెలంగాణపై ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు కూడా విలువ లేకుండా పోయిందని ఆయన అన్నారు. కాంగ్రెసు ద్వంద్వ వైఖరి వల్లనే తెలంగాణ రావడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసుకు తెలంగాణ ప్రజల ఉసురు తగులుతుందని ఆయన అన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications