వికె సింగ్ లేఖపై రాజ్యసభలో దుమారం, ఆంటోనీ వివరణ
సైన్యంలో ఆయుధాల కొరత ఉందంటూ ఆర్మీ చీఫ్ ఇటీవల ఆర్మీ చీఫ్ వికె సింగ్ ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖ రాశారు. యుద్ధ ట్యాంకులు శిథిలావస్థకు చేరుకున్నాయని ఆయన అన్నారు. సైన్యం కన్నా వైమానిక దళమే బాగుందని ఆయన అభిప్రాయపడ్డారు. వికె సింగ్ రాసిన లేఖపై దుమారం చెలరేగిన నేపథ్యంలో కేంద్ర మంత్రులు చిదంబరం, ఆంటోనీ ప్రధానితో సమావేశమయ్యారు. ఆ వ్యవహారంపై చర్చించారు. దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదని సమావేశానంతరం ఆంటోనీ అన్నారు.
వికె సింగ్ను తొలగించాలని ఎస్పీ, జెడియులు డిమాండ్ చేశాయి. అయితే, ఆ డిమాండును బిజెపి వ్యతిరేకించింది. వికె సింగ్ వ్యవహారం క్రమశిక్షణకు సంబంధించిందని, వికె సింగ్ను తప్పించాలని, వికె సింగ్పై చర్య తీసుకోకపోతే చెడు సంప్రదాయం ఏర్పడుతుందని జెడియు నాయకుడు శివానంద్ తివారీ అన్నారు. వికె సింగ్ను తప్పించి, జైలులో పెట్టాలని ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ మీడియా ప్రతినిధులతో అన్నారు. లీక్పై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి.