చిరంజీవిపై చంద్రబాబు సెటైర్లు: తలసాని డుమ్మా

లోకసభలో ప్రతిపక్ష హోదా దక్కించుకున్న ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఒక్కటే అని ఆయన అన్నారు. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు తెలుగుదేశం కారణంగానే ఏర్పడ్డాయని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. తెలుగుజాతికి ఎన్టీ రామారావు గౌరవాన్ని కల్పించారని ఆయన అన్నారు. తెలుగు జాతిని తాను ప్రపంచ పటం మీద నిలబపెట్టానని ఆయన చెప్పుకున్నారు. హైదరాబాదు తన ప్రభుత్వ హయాంలోనే అభివృద్ది చెందిందని ఆయన అన్నారు. తాను హైదరాబాదు రూపురేఖలు మార్చానని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని ఆయన విమర్శించారు. వైయస్ హయాంలోని అవినీతిపై తాము జాతీయ స్థాయిలో పోరాటం చేశామని ఆయన చెప్పారు. వైయస్ అవినీతి కూడా కాంగ్రసు వ్యవహారంలో భాగంగానే జరిగిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications