గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా పేరు వింటే సోనియా ఉలిక్కి పడి లేస్తారు: జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: ప్రజల్లో తనకు పెరుగుతున్న ఆదరణ చూసి తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులకు కంటిమీద కునుకు ఉండట్లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. "యూపీఏ చైర్‌పర్సన్ సోనియా సైతం జగన్ పేరు వింటే నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచి కూర్చుంటోంది'' అని అన్నారు. అందుకే వాళ్లంతా కలిసి తనను అరెస్టు చేయించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓదార్పు యాత్రలో భాగంగా గుంటూరులో గురువారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. "నా తండ్రి హయాంలో ఏనాడైనా సచివాలయానికి వెళ్లి పైరవీలు చేశానా? ఏ ఐఏఎస్ అధికారితోనైనా కనీసం ఫోన్లోనైనా మాట్లాడానా? ఏ కంపెనీతోనైనా సంబంధాలు పెట్టుకున్నానా?'' అని ప్రశ్నించారు.

కేవలం సోనియాకి తల వంచనందుకే తనవాళ్లను అరెస్టు చేస్తున్నారంటూ ఆగ్రహించారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఎక్కడిదని ప్రశ్నించారు. కోవూరు ఎన్నికల్లో రూ.500 నోట్లు పంచింది చంద్రబాబు కాదా అని అడిగారు. చంద్రబాబులా తాను నీచ రాజకీయాలు చేయలేనని, చీకట్లో చిదంబరాన్ని కలవనని ఎద్దేవా చేశారు. హెరిటేజ్ సంస్థను స్థాపించడానికి చంద్రబాబుకు అంత డబ్బు ఎక్కడదని ప్రశ్నించారు. నీతి వాక్యాలు వల్లించే చంద్రబాబుకు సీబీఐతో విచారణ చేయించుకునే దమ్ముందా అని విరుచుకుపడ్డారు.

English summary
YSR Congress president YS Jagan said that Congress president is fearing of him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X