వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిఎం పర్యటనలో ఫ్లెక్సీ వివాదం, చించేసిన కార్యకర్తలు
కాగా ఆ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. భద్రాద్రి రాముడికి పట్టు చీరలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆయన సతీసమేతంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సిఎం కిరణ్ భద్రాచలం ఆలయ అభివృద్ధికి ప్యాకేజ్ ప్రకటించారు. ఆలయ అభివృద్ధికి రూ.ఏడు కోట్ల రూపాయలను కేటాయించారు. తాగునీటి అవసరాల కోసం రూ.15 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. మిథిల కల్యాణ మండపంలో అభిజిత్ లగ్నంలో వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య అర్చకులు సీతారాముల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Comments
bhadrachalam kiran kumar reddy ramachandraiah chiranjeevi భద్రాచలం కిరణ్ కుమార్ రెడ్డి రామచంద్రయ్య చిరంజీవి
English summary
Congress Party activists teared flexi at Bhadrachalam.
Story first published: Sunday, April 1, 2012, 15:29 [IST]