లక్ష్మీనారాయణకు వై కేటగిరీ భద్రత, బుల్లెట్ ప్రూఫ్ కారు
ఎమ్మార్ అక్రమాలు, ఓబుళాపురం గనులు, జగన్ అక్రమాస్తుల కేసుతోపాటు గుజరాత్కు సంబంధించిన సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసుల దర్యాప్తును లక్ష్మీనారాయణ పర్యవేక్షిస్తున్నారు. జగన్ కేసుకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలక ప్రాధాన్యం ఉన్న సంగతి తెలిసిందే. జెడి విచారణ జరుపుతున్న కేసుల్లో ప్రాధాన్యం దృష్ట్యా ఆయనకు భద్రత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సర్కారు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించాలంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ను రాష్ట్ర సర్కారు ఆదివారం ఆదేశించింది. జెడి నివాసం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఉంది. ఆయన ఇంటికి కూడా భద్రత సిబ్బందిని నియమించనున్నారు.
Comments
laxmi narayana cbi probe ys jagan ysr congress hyderabad లక్ష్మీ నారాయణ సిబిఐ దర్యాఫ్తు వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు హైదరాబాద్
English summary
CBI Joint Director V.V. Lakshminarayana has been accorded 'Y' category protection after intelligence agencies found a threat perception to his life in the backdrop of chargesheets filed in high profile cases.
Story first published: Monday, April 2, 2012, 8:42 [IST]