వైయస్ అల్లుడ్ని అరెస్టు చేయాలి: తె.క్రైస్తవ సంఘాలు

హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బుధవారం తెలంగాణ క్రైస్తవ సంఘాల సమాఖ్య, క్రైస్తవ హక్కుల పరిరక్షణ ఫ్రంట్, ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కాన్ఫరెన్స్, క్రైస్తవ గుడిసెవాసుల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడారు. రాజేంద్రనగర్ మండలం మణికొండలో అనాథలకు కేటాయించిన నాలుగెకరాల భూమిని బ్రదర్ అనిల్ కుమార్ హస్తగతం చేసుకున్నారని ఆరోపించారు.
తన మామ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ స్థలాలను పేదల పేరుతో కబ్జా చేశారని పేర్కొన్నారు. వాటిని ప్రశ్నిస్తే బెదిరింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. వీటిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. వైయస్ అధికారంలో ఉన్నప్పుడు అనాథాశ్రమం పేరిట కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనపరుచుకోవాలని డిమాండ్ చేశారు.
క్రైస్తవులు, అనాథల సంక్షేమం కోసం అనేక సంస్థలు పని చేస్తుండగా ఆయా సంస్థలను వదిలేసి అనిల్కు కేటాయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వైయస్ ప్రభుత్వం హయాంలో అనిల్ పేదల భూములు, క్రైస్తవుల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఆయన క్రైస్తవ సంస్థలు, విదేశీ మిషనరీలు, పాస్టర్లను మోసం చేస్తూ దేవుడి పేరును అవమానిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ పాస్టర్లను అణిచివేసేందుకు ప్రయత్నించారన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications