'వైయస్'పై రెచ్చగొడుతున్నారు, అది కుట్ర: గోనె ప్రకాశ్

వైయస్ లాంటి వ్యక్తిని విమర్శించడం సరికాదన్నారు. ఉప ఎన్నికలు జరిగే పద్దెనిమిది నియోజకవర్గాలలోనూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. మంత్రి పదవి కోసం అప్పుడు వైయస్ భజన చేసిన నేతలు ఇప్పుడు కిరణ్ భజన చేస్తున్నారని మండిపడ్డారు.
కొండ్రు మురళిది అదే నైజమన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత మరో ముఖ్యమంత్రి వస్తే ఆయన భజన చేసేందుకు కూడా కొండ్రు సిద్ధంగా ఉండారని ఎద్దేవా చేశారు. విశాఖలో రూ.150 కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకు కొట్టేసిన ఘనుడు కొండ్రు అన్నారు.
ఆయనకు దళితుల మీద అంత ప్రేమ ఉంటే ఆ భూమిని వారికే పంచాలని సవాల్ చేశారు. ఏనాడూ దళితుల కోసం మాట్లాడని కొండ్రు ఇప్పుడు మాట్లాడటం వెనుక ఖచ్చితంగా కుట్ర దాగి ఉందన్నారు. ఏ ముఖ్యమంత్రి హయాంలో దళితులకు ఎంతమేర కేటాయించారో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైయస్ విషయంలో హరిజన నేతలను రెచ్చగొట్టి కాంగ్రెసు దుష్ప్రచారం చేస్తోందన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శిస్తే కాంగ్రెసు పార్టీయే నష్ట పోతుందని మరో నేత జూపూడి ప్రభాకర రావు తిరుపతిలో అన్నారు. పదే పదే వైయస్ను దళిత నేతలు విమర్శించడం సరికాదన్నారు. ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications