ఢిల్లీ నుండి సిబిఐ లక్ష్మీనారాయణకు అత్యవసర పిలుపు

శనివారం ఉదయం ఢిల్లీకి రావాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ఆయన ఈ రోజు సాయంత్రం ఏడు గంటల ఫ్లైట్కు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. లక్ష్మీ నారాయణ సిబిఐ డైరెక్టర్తో రేపు ఉదయం పది గంటలకు భేటీ కానున్నారు. తాను దర్యాఫ్తు చేస్తున్న పలు కీలక కేసుల పురోగతిని ఆయనకు వివరించనున్నారు. ఈ కేసులపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
శనివారం సాయంత్రం లక్ష్మీ నారాయణ ఢిల్లీ నుండి మెక్సికోకు వెళ్లనున్నారు. అక్కడ ఆయన దర్యాఫ్తు సంస్థల అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటారు. మూడు రోజుల అక్కడే ఉంటారు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి వస్తారు. లక్ష్మీ నారాయణ ప్రొఫెషనల్ పాసుపోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు పాసుపోర్టు జారీ అయింది.
కాగా లక్ష్మీ నారాయణ జగన్ ఆస్తుల కేసులో పది రోజుల క్రితం సిబిఐ ప్రత్యేక కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విడతల వారిగా ఛార్జీషీట్ దాఖలు చేస్తామని సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ చెప్పారు. ఓబుళాపురం మైనింగ్, ఎమ్మార్ కేసులోనూ ఇప్పటికే ఛార్జీషీట్ దాఖలు చేశారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి












Click it and Unblock the Notifications