కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్‌కు రాజీనామా యోచనలో గంగుల, జగన్ గూటికే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kurnool Map
కర్నూలు: జిల్లాకు చెందిన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత గంగుల ప్రతాప్ రెడ్డి కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆళ్లగడ్డ నుండి పోటీకి గంగుల ప్రతాప్ రెడ్డి దూరంగా ఉన్నారు. జిల్లా కాంగ్రెసు పార్టీలోని విభేదాల కారణంగానే ఆయన పోటీకి దూరంగా ఉన్నారని, కాంగ్రెసుకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధపడుతున్నారని అంటున్నారు. ప్రతాప్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కూడా కాంగ్రెసు నుండి బయటకు వెళ్లనున్నారు.

కాగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పోటీపై వ్యాఖ్యానించేందుకు గంగుల ప్రతాప్ రెడ్డి నిరాకరించారు. ఆళ్లగడ్డలో తాను మాత్రం పోటీ చేయడం లేదని చెప్పారు. పార్టీ అభ్యర్థి ఎవరో తనకు తెలియదన్నారు. తాను కాంగ్రెసు పార్టీలో కొనసాగడంపై కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఆళ్లగడ్డకు మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు ఇంచార్జులుగా ఉన్న విషయం తనకు తెలియదని చెప్పారు.

ద్వంద్వ ప్రమాణాలు ఉన్న కాంగ్రెసు పార్టీలో కొనసాగలేక పోవచ్చునని గంగుల ప్రతాప్ రెడ్డి, గంగుల ప్రభాకర రెడ్డి చెప్పారు. రాజీనామా విషయం ఆళోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని తెలుస్తోంది. కాగా గంగుల సోదరులు ఇద్దరూ రాజీనామా చేసి త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది.

కర్నూలు జిల్లాలో భూమా నాగి రెడ్డి, గంగుల ప్రతాప రెడ్డిల హావా బాగానే ఉంది. ఇప్పటికే భూమా నాగి రెడ్డి దంపతులు జగన్ పార్టీలో చేరారు. తాజాగా గంగుల సోదరులు కూడా జగన్ పార్టీలోకి వెళితే కర్నూలు జిల్లాలో కాంగ్రెసుకు కష్టాలు తప్పవని అంటున్నారు. ముఖ్యంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కాంగ్రెసు మచ్చుకైనా కనిపించదని చెబుతున్నారు.

English summary
Kurnool district senior Congress leader is thinking to resign to party due to differences with district leaders. He said, he is not contesting from Allagadda constituency in upcoming bypolls. It is said that he may join in YS Jaganmohan Reddy's YS Jaganmohan reddy's YSR Congress party soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X