మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?
బాలినేని జనసేనలో కొనసాగుతారా. తిరిగి వైసీపీ గూటికి చేరుతారా. ప్రస్తుతం బాలినేని నిర్ణయం పైన రాజకీయంగా చర్చ సాగుతోంది. జగన్ కు బంధువు అయిన బాలినేని వైసీపీని వీడి జనసేన లో చేరారు. అయితే, ఒంగోలు కేంద్రంగా చోటు చేసుకుంటున్న రాజకీయాల్లో బాలినేని ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు. తాజాగా తన కుమారుడుతో కలిసి పవన్ తో సమావేశం అయ్యారు. అటు బాలినేని తిరిగి వైసీపీలోకి వస్తారనే ప్రచారం వేళ.. బాలినేని చేసిన ట్వీట్ వైరల్ అయింది. అయితే, అంతలోనే ఆ ట్వీట్ డిలీట్ చేయటంతో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి.
వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని వ్యవహారం పైన కొంత కాలంగా రాజకీ యంగా చర్చ జరుగుతోంది. జనసేనలో చేరినా గుర్తింపు లేకపోవటంతో తిరిగి వైసీపీ లోకి వస్తారనే ప్రచారం వేళ.. బాలినేని తాజా ట్వీట్ తో స్పష్టత వచ్చినట్లు కనిపించింది. అయితే, అంతలోనే ఆ ట్వీట్ డిలీట్ చేసారు. 2024 ఎన్నికల ఫలితాల తరువాత ఓటింగ్.. ఈవీఎంల పైన అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఆ తరువాత పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. వైసీపీ పైన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అప్పటికే ఎంపీ సుబ్బారెడ్డితో ఉన్న విభేదాలతో బాలినేని ఆగ్రహంతో ఉన్నారు.

అయితే, జనసేనలో చేరిన తరువాత స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే తో గ్యాప్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఒంగోలులో బాలినేని స్థానంలో వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ ను జగన్ నియమించారు. తాజాగా జరిగిన పార్టీ ఒంగోలు సమీక్షలోనూ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఒంగోలు అనగానే వాసన్న విషయంలో కొన్ని ప్రశ్నలు వస్తాయని వ్యాఖ్యానించారు. అదే సమయంలో వాసన్నా మళ్లీ వస్తాడా అంటూ జగన్ ప్రశ్నించారు. దీంతో.. బాలినేని వైసీపీలోకి రీ ఎంట్రీ ఖాయమేనా అనే ప్రచారం మొదలైంది.
బాలినేని రాజకీయ నిర్ణయం ఏంటి..?
కాగా, ఈ సమయంలోనే తన కుమారుడు తో కలిసి బాలినేని తాజాగా డిప్యూటీ సీఎం పవన్ తో సమావేశం అయ్యారు. సుదీర్ఘంగా చర్చించారు. ఒంగోలులో పరిస్థితులను వివరించారు. ఆ తరువాత బాలినేని చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. తాను వైసీపీలో రీ ఎంట్రీ ఇస్తున్నానే ప్రచారం వేళ.. ఎక్కడా వైసీపీ పేరు ప్రస్తావన చేయకుండానే తన మనసులో మాట ఏంటో స్పష్టం చేసారు.

ఈ మేరకు బాలినేని చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో పవన్ తో ఉన్న ఫొటోలను జత చేసిన బాలినేని..' ఆయన మాకు ఒక నాయకుడు మాత్రమే కాదు... నమ్మకం, ఆదరణ, ఆశ్రయం..' అని పేర్కొన్నారు. దీని ద్వారా తన కుమారుడితో కలిసి పవన్ ను కలవటం ద్వారా.. తనయుడికి రాజకీయంగా స్పష్టమైన హామీ పొందినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆ తరువాత ఆ ట్వీట్ డిలీట్ చేసారు. సన్నిహితులు.. మద్దతు దారులతో బాలినేని చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఈ పరిణామాల నేపథ్యంలో బాలినేని మనసు మారిందా.. రాజకీయంగా ఏం చేబోతున్నారనే చర్చ ఆసక్తి కరంగా మారుతోంది.
-
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..













Click it and Unblock the Notifications