బిజెపి కార్యవర్గం నుంచి సంజయ్ జోషీ రాజీనామా

పార్టీలోని నిర్ణయాత్మక విభాగం జాతీయ కార్యవర్గంలో తన ప్రత్యర్థి సంజయ్ జోషీకి స్థానం కల్పించడం పట్ల నరేంద్ర మోడీ నితిన్ గడ్కరీపై అసంతృప్తితో ఉన్నారు. దాంతో ముంబైలో జరుగుతున్న జాతీయ కార్యవర్గానికి తాను హాజరు కాబోనని కూడా నరేంద్ర మోడీ సంకేతాలు ఇచ్చారు.
మే 24వ తేదీన మోడీ ఉదయపూర్లోని ఓ కార్యక్రమంలో పాల్గొంటున్నారని గుజరాత్ ప్రభుత్వం బుధవారం తెలిపింది. రాజస్థాన్లోని ఉదయపూర్లో మహారాణ ప్రతాప్ జయంతి వార్షిక కార్యక్రమానికి నరేంద్ర మోడీ హాజరవుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది.
సంజయ్ జోషీని నితిన్ గడ్కరీ పార్టీ జాతీయ కార్యవర్గంలోకి తిరిగి తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మోడీ ఢిల్లీలో జరిగిన సమావేశానికి నరేంద్ర మోడీ హాజరు కాలేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మోడీ ప్రచారం కూడా చేయలేదు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు గురు, శుక్రవారాల్లో ముంబైలో జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications