బాలకృష్ణ డైలాగ్: 'జగన్' భుజాలు తడుముకుంటారా?

మంచి నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలి కానీ రోడ్ల మీద కాదు. ఉన్నట్టుండి ఈ విగ్రహ రాజకీయాలు ఎందుకు మొదలు పెట్టావో, చెబుతావా లేక చెప్పించమంటావా అనే డైలాగ్ ట్రయరల్స్లో కనిపిస్తోంది. ఇది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను జగన్ రాష్ట్రంలోని అన్ని చోట్ల పెట్టిస్తున్న విషయం తెలిసిందే.
ఈ విగ్రహాలపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిత్యం ప్రభుత్వాన్ని, జగన్ను ప్రశ్నిస్తోంది. ప్రతి విగ్రహానికి అనుమతులు తీసుకోవాలని, అనుమతి తీసుకోని విగ్రహాలను కూల్చాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ చిత్రంలో అందుకు సంబంధించిన డైలాగ్ ఉండటం రాజకీయ వర్గాల్లో కాక రేపుతోంది.
విగ్రహాల రాజకీయాలు అంటూ బాలకృష్ణ తన అధినాయకుడు చిత్రంలో చేసిన ఈ డైలాగ్కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గానీ లేక ఆ పార్టీ నేతలు గానీ భుజాలు తడుముకుంటారా చూడాలా అనే ఆసక్తికర చర్చ జరుగుతోందని అంటున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని కూడా టార్గెట్ చేసుకొని పరోక్షంగా విమర్శలు చేశారనే ప్రచారం జరుగుతోంది. బాలయ్య తన తాజా చిత్రంలో ఇటు జగన్ను, అటు చిరంజీవిని టార్గెట్ చేసుకున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆ చిత్రంపై ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications