జగన్ అభ్యర్థికి చుక్కెదురు, గాల్లోకి గన్మెన్ కాల్పులు

అక్కడ శ్రీకాంత్ రెడ్డికి స్థానికుల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుండి చుక్కెదురయింది. ఆయన ప్రచారాన్ని అడ్డుకున్నారు. దీంతో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ముదిరి ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. దీంతో శ్రీకాంత్ రెడ్డి గన్మెన్ గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ బాలుడికి కొద్దిగా గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.
అదనపు బలగాలు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. కాగా ఉద్దేశ్య పూర్వకంగానే తమ ప్రాంతంలోకి ప్రచారం పేరున వచ్చి తమను రెచ్చగొట్టే ప్రయత్నాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.
కాగా అనంతపురం జిల్లా కొడికొండ చెక్ పోస్టు వద్ద సోమవారం ఉదయం పోలీసులు రూ.కోటిని స్వాధీనం చేసుకున్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలలో భాగంగా ఈ నగదును పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ డబ్బు బెంగళూరు నుండి వచ్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications