ఇబ్బంది పెట్టారా అని అడిగిన జడ్జి: లేదన్న జగన్

ఐదు రోజుల పాటు సిబిఐ అధికారులు వైయస్ జగన్ను తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. గురువారం సాయంత్రం జగన్ సిబిఐ కస్టడీ ముగిసింది. గురువారం సాయంత్రం సమయం మించిపోవడంతో ఆయనను కోర్టులో హాజరు పరచలేకపోయారు. శుక్రవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఆయనను విచారించింది.
వైయస్ జగన్కు చెందిన సంస్థల్లోకి పెట్టుబడుల ప్రవాహంపై సిబిఐ దృష్టి పెట్టింది. జగతి పబ్లికేషన్స్ (సాక్షి పత్రిక), ఇందిరా టెలివిజన్ (సాక్షి టీవీ), జననీ ఇన్ఫ్రా సంస్థల్లోకి పెట్టుబడులు వచ్చిన తీరుపై సిబిఐ అధికారులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. వైయస్ జగన్ తమ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదని సిబిఐ అధికారులు భావించారు.
దాంతో మరో మూడు రోజుల పాటు జగన్ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిబిఐ గురువారం లంచ్ మోషన్గా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. అత్యవసరంగా దానిపై విచారణను చేపట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications