పూరి రథయాత్ర తొక్కిసలాటలో విశాఖ మహిళ మృతి

మరణించిన ఇద్దరు భక్తుల్లో ఒకర్ని విశాఖపట్నానికి చెందిన రవణమ్మ (30)గా గుర్తించారు. మరో వ్యక్తి పురుషుడు. అతను ఎవరనేది గుర్తించాల్సి ఉంది. ఇద్దరి మృతదేహాలను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. రథయాత్ర గుంపులో ఆ మహిళ ఉందా, లేదా అనేది తెలియాల్సి ఉందని పూరి జిల్లా కలెక్టర్ అర్వింద్ అగర్వాల్ అన్నారు. అసలు తొక్కిసలాట జరిగిందా, లేదా అనేది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు.
వాతావరణం చల్లగానే ఉన్నప్పటికీ పలువురు యాత్రికులు స్పృహ తప్పి ఆస్పత్రి పాలయ్యారు. తల తిప్పుతోందనే కారణంతో చాలా మంది ఆస్పత్రిలో చేరారు. చికిత్స చేసి వారిని డిశ్చార్జి చేశారు. తొమ్మిది రోజుల మహోత్సవంలో పోలీసులు యాత్రికులను నియంత్రించడంలో విఫలమయ్యారనే విషయాన్ని ఇద్దరు భక్తుల మృతి అద్దం పడుతోందని అంటున్నారు.
గుంపులను అదుపు చేయడంలో పోలీసులు విఫలం కావడంతో 2008, 2010, 2011ల్లో కూడా తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయి.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications