చిరు సిఎం: తప్పులేదన్న గండ్ర, కెవిపి ఎందుకన్నారో
రాజ్యసభ సభ్యుడు, తమ పార్టీ నేత కెవిపి రామచంద్ర రావు వ్యాఖ్యలపై పదే పద మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. కెవిపి ఇన్ని రోజుల తర్వాత వైయస్ ఫోటో విషయాన్ని ఎందుకు ప్రస్తావించారో అర్థం కావడం లేదన్నారు. వైయస్ ఫోటో పెట్టాలా లేదా తొలగించాలా అనేది అసలు అంశమే కాదన్నారు. ఆ దిశలో పార్టీలో ఎవరూ ఆలోచించడం లేదన్నారు. కెవిపి అనవసరంగా ఈ విషయాన్ని తెర పైకి తీసుకు వచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక రాయల సీమ అంటూ నినదిస్తున్న తెలుగుదేశం పార్టీ సీమ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యాఖ్యల వెనుక ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉండి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. లేదంటే బాబు బైరెడ్డి వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోవడానికి సహకరిస్తామని చెప్పిన బాబు ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారన్నారు.
తెలంగాణ వస్తుందనే తాను రాయలసీమ కోసం మాట్లాడుతున్నానని బైరెడ్డి అన్నారని, ఇవి ఆయన మాటలేనా లేక బాబు మాటనా వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని ప్రాజెక్టులు ఆయనకు ఇప్పుడు గుర్తుకు రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పోలవరం గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదన్నారు. బాబు తన హయాంలో రాష్ట్రంలో ఒక్క సాగు నీటి ప్రాజెక్టును కూడా చేపట్టలేదన్నారు. ప్రభుత్వం రంగ సంస్థలను చారు చౌకగా విక్రయించిన ఘనత బాబుదే అన్నారు.