టెక్కీ నీలిమ ఆఫీసుకు వెళ్లడమే పెద్ద మిస్టరీ

హైదరాబాదుకు వచ్చిన పది రోజుల తర్వాత ఇన్ఫోసిస్ కార్యాలయానికి వచ్చిన ఆమె పాత మిత్రులను ఎవరినీ కలుసుకోలేదని చెబుతున్నారు. ఆమె బ్లాక్ 18లోకి వెళ్లినట్లు సిసిటివీ కెమెరాల చిత్రాల ద్వారా తెలుస్తోంది. అక్కడ ఆమె చేస్తున్న ప్రాజెక్టుకు సంబంధించిన పని కూడా ఏమీ లేదని చెబుతున్నారు. నిజానికి, హైదరాబాదులో నీలిమ చేసిన ప్రాజెక్టుకు సంబంధించిన పని ఏదీ లేదు. ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్నవారు అమెరికాకు, పూణేకు చెందినవారేనని తెలుస్తోంది.
ఆ రాత్రి ఆమె తన కారును కూడా తీసుకుని రాలేదని చెబుతున్నారు. సిసిటివీ కెమెరా చిత్రాలను బట్టి చూస్తే ఆమె చాలా ఆనందంగా ఉన్నట్లు కనిపించింది. హైదరాబాద్ ఇన్ఫోసిస్ కార్యాలయానికి ఆమె ఎందుకు వెళ్లిందనేది తెలిస్తే మృతి మిస్టరీ విడిపోతుందని అంటున్నారు. నీలిమ మంగళవారం రాత్రి 8.36 నిమిషాలకు తన వద్ద ఉన్న ఐడీ కార్డ్ను స్క్రాచ్ చేసి కంపెనీలోకి వెళ్ళిన ఆధారాలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్టు డిసిపి యోగానంద్ శుక్రవారం తెలిపారు. 9.30 నిమిషాలకు కంపెనీలోని బిల్డింగ్ నెంబర్ 18, 19లోకి వెళ్లినట్టు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించామన్నారు. 10.29 నిమిషాలకు మల్టీలెవల్ పార్కింగ్ వద్ద పెద్ద శబ్దం వచ్చిందని, అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ పీఎస్.రమేష్ ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించాడని చెప్పారు.
ఈ విషయాన్ని వెంటనే సెక్యూరిటీ అధికారి యాజమాన్యానికి తెలియజేశాడని, కంపెనీ అంబులెన్స్ సహాయంతో నీలిమను ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది రమేష్, సురేష్సింగ్, వెంకటేష్ ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పారు. రాత్రి 10.37 నిమిషాలకు ఈ విషయం తెలుసుకున్న రాయదుర్గం పోలీసులు 11 గంటల సమయంలో సంఘటన స్థలానికి వెళ్లారని ఆయన తెలిపారు. నీలిమ బిల్డింగ్ నెంబర్ 18,19లో తిరిగినట్టు సీసీ కెమెరాల ఆధారంగా తెలిసిందన్నారు. ఆమె వెంట తెచ్చుకున్న హ్యాండ్బ్యాగ్ పదో అంతస్థులో పడి ఉన్నట్టు చెప్పారు. ఏడో అంతస్థులో ఆమె కాలి చెప్పును, తెల్లని పైపుపై మరకలను గుర్తించామని డీసీపీ తెలిపారు.
నీలిమ బ్యాగ్లోని ఫోన్ నెంబర్ స్లిప్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆ నెంబర్ల ఆధారంగా బంధువులకు సమాచారం అందించినట్టు ఆయన తెలిపారు. నీలిమ హత్యకు గురైందా..లేదా దూకి మరణించిదా అనే విషయాన్ని మీడియా ప్రతినిధులు అడగ్గా డీసీపీని అడగగా, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిర్ధారణ అవుతుందని ఆయన చెప్పారు. కంపెనీలో ఏర్పాటు చేసిన 14 సీసీ కెమెరాలను పరిశీలించి నీలిమ ఎటువైపు వెళ్లిందోనన్న డాటాను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. దీంతో పాటు ఫొరెన్సిక్ నిపుణులు ఇచ్చే నివేదికను పరిశీలిస్తామని చెప్పారు. ప్రస్తుతం నీలిమది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications