చంద్రబాబే చేశారు: అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీ
ముస్లింలకు తమ పార్టీ దగ్గరవుతుందనే అక్కసుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస రావు, మాల్లాది విష్ణు, జోగి రమేష్లు అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మైనార్టీల సంక్షేమం టిడిపి ఆవిర్భావం నుంచే కృషి చేస్తోందన్నారు. అబ్దుల్ కలాం వంటి ఉత్తముడిని చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిగా చేశారన్నారు.
తొమ్మిది వేల మసీదుల నిర్మాణం, 500 షాదీఖానాలు మంజూరు, దుకాన్ ఔర్ మకాన్ పథకం, రోషిణి పథకం, ఉర్దూ పాఠశాలలు తదితర వాటిని ఏర్పాటు చేసింది చంద్రబాబు హయాంలోనే అన్న విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ బిసి డిక్లరేషన్ ప్రకటించగానే ఇతర పార్టీల వెన్నులో వణుకు పుడుతోందన్నారు.
Comments
vallabhaneni vamsi chandrababu naidu abdul kalam telugudesam vijayawada వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు అబ్దుల్ కలాం తెలుగుదేశం విజయవాడ
English summary
Telugudesam Party Krishna district urban president Vallabhaneni Vamshi said that Abdul Kalam a minority candidate was became a president with the help of Telugudesam.