విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణపై కేసు నమోదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vangaveeti Radhakrishna
విజయవాడ: కృష్ణా జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణపై పోలీసు కేసు నమోదైంది. ఆయనపై హనుమాన్ జంక్షన్ పోలీసు స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. తనను వంగవీటి రాధాకృష్ణ కులం పేరుతో దూషించాడని రవికుమార్ అనే యువకుడు పోలీసు స్టేషన్‌లో ఇటీవల ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఈ రోజు కేసు నమోదు చేశారు.

ఈ నెల 13వ తేదిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో ఫీజు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆమె ఈ దీక్ష కోసం వెళ్తూ హనుమాన్ జంక్షన్ వద్ద కొద్దిసేపు ఆగారు. అప్పుడు ఆమెను కలిసేందుకు వంగవీటి రాధా మరో పార్టీ నేత దుట్టా రామచంద్ర రావు ఇంటికి వచ్చారు.

ఆ సమయంలో రాధ తన పూర్వ అనుచరుడు కొమళ్ల రవి కుమార్‌ను కులం పేరుతో దూషించినట్లుగా హనుమాన్ జంక్షన్ పోలీసు స్టేషన్‌లో గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. వంగవీటి రాధాతో పాటు మరో నలుగురి పైన కూడా ఈ కేసు నమోదైంది. వంగవీటి రాధాకృష్ణ తొలి నుండి కాంగ్రెసులో ఉన్నారు.

ఆ తర్వాత 2008లో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో ఆ పార్టీలో చేరారు. చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెసులో విలీనం చేయడంతో రాధా వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. అప్పటి నుండి జిల్లాలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు.

English summary
Krishna district police filed a case against YSR Congress 
 
 party leader Vangaveeti Radhakrishna on Thursday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X