జగన్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణపై కేసు నమోదు

ఈ నెల 13వ తేదిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో ఫీజు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆమె ఈ దీక్ష కోసం వెళ్తూ హనుమాన్ జంక్షన్ వద్ద కొద్దిసేపు ఆగారు. అప్పుడు ఆమెను కలిసేందుకు వంగవీటి రాధా మరో పార్టీ నేత దుట్టా రామచంద్ర రావు ఇంటికి వచ్చారు.
ఆ సమయంలో రాధ తన పూర్వ అనుచరుడు కొమళ్ల రవి కుమార్ను కులం పేరుతో దూషించినట్లుగా హనుమాన్ జంక్షన్ పోలీసు స్టేషన్లో గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. వంగవీటి రాధాతో పాటు మరో నలుగురి పైన కూడా ఈ కేసు నమోదైంది. వంగవీటి రాధాకృష్ణ తొలి నుండి కాంగ్రెసులో ఉన్నారు.
ఆ తర్వాత 2008లో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో ఆ పార్టీలో చేరారు. చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెసులో విలీనం చేయడంతో రాధా వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. అప్పటి నుండి జిల్లాలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications