హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ రిమాండ్ పొడిగింపు: సిబిఐ తీరుపై కోర్టు ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి, ఎమ్మార్ కేసుల నిందితులకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు వచ్చే నెల 11వ తేది వరకు రిమాండును పొడిగించింది. జగన్ ఆస్తుల కేసులో వైయస్ జగన్, బ్రహ్మానంద రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్‌లకు కోర్టు రిమాండును పొడిగించింది.

ఓఎంసి కేసులో నిందితులు గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, ఎమ్మార్ కేసు నిందితులు సునీల్ రెడ్డి, బిపి ఆచార్య, విజయరాఘవలకు కూడా కోర్టు రిమాండును పొడిగించింది. వీరందరినీ సిబిఐ కోర్టు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ రోజు విచారించింది. కాగా సిబిఐ అధికారుల తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

నిందితులకు ఛార్జీషీట్లు అందించడంలో సిబిఐ అధికారులు జాప్యం చేస్తున్నారని డిఫెన్స్ న్యాయవాదులు కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీంతో సిబిఐ పని తీరుపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఛార్జీషీట్లు అందించే విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. ఈ విషయమై అధికారులు బుధవారం కోర్టులో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

మరోవైపు గాలి బెయిల్ డీల్ కేసులో పట్టాభి రామా రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది.

English summary
Nampally CBI Court extended YSR Congress party chief and YS Jaganmohan Reddy's remand till September 11th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X