వీళ్లు మగాళ్లా: కాంగ్రెసు నేతలపై నారాయణ వ్యాఖ్య

ఈ ప్రాంత కాంగ్రెస్ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు చేతగాని దద్దమ్మలై సోనియాను చూసి దాక్కుంటున్నారని మండిపడ్డారు. 'జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర' అంటున్న కాంగ్రెస్ నేతలందరూ గాంధీభవన్లో ఒకేచోట ఉంటూ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. డిసెంబర్ 9 ప్రకటనపై మాట తప్పిన కాంగ్రెస్ నేతలను పట్టపగలు నడివీధిలో ఊరేగించి ఉరివేయాలన్నారు.
వీరంతా మోసకారులని, ముక్కునేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో కప్పల్లా అరుస్తూ ఢిల్లీలో మాత్రం పిల్లుల్లా మూలుగుతారని విమర్శించారు. రొయ్యకులాగే వీరికీ మీసాలున్నాయి తప్ప రోషం మాత్రం లేదని దెప్పిపొడిచారు. "పార్లమెంటులో సోనియాను చూసి, తలలు బెంచీల కింద పెట్టుకునే మీరు మగాళ్లా?'' అని ఎద్దేవా చేశారు. అవసరమనుకుంటే కాంగ్రెస్ పార్టీ దేవుడిని కూడా అమ్ముకుంటుందని అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట వీరుల కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తుంటే మంత్రుల లూటీకి ప్రభుత్వం వంతపాడుతోందని విమర్శించారు. విద్యుత్తు సమస్యను పరిష్కరించకపోతే ప్రజలు గుండు కొట్టించి ఊరేగిస్తారని హెచ్చరించారు. నాన్చుడు ధోరణి విడనాడి తెలంగాణపై కలసిరావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబుకు హితవుపలికారు.












Click it and Unblock the Notifications