తెలంగాణ అంశాన్ని కేంద్రంపైకి నెట్టిన జగన్ పార్టీ నేత

తన పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ తీరుపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం, మంత్రి ధర్మాన ప్రసాదరావుకు మరో న్యాయమా అని ఆమె అడిగారు. ధర్మాన బెయిల్ తీసుకుని బయటకు వచ్చారని, జగన్ బెయిల్ విచారణకు వచ్చిన ప్రతిసారీ బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని అంటోందని ఆమె అన్నారు. మంత్రులు, అధికారులు సాక్షులను ప్రభావితం చేయరా అని ఆమె అడిగారు.
ధర్మాన ప్రసాదరావు బెయిల్ విషయంలో సిబిఐ ఎందుకు మౌనంగా ఉందని ఆమె అడిగారు. జగన్ పట్ల సిబిఐ కక్షపూరిత వైఖరి బయటపడిందని ఆమె అన్నారు. ఒకే కేసులో అధికారులు బయట ఉండవచ్చు, జగన్ మాత్రం జైలులో ఉండాలా అని ఆమె అడిగారు.
ఒక్క సాక్షినైనా జగన్ ప్రభావితం చేశాడని సిబిఐ నిరూపించగలదా అని ఆమె ప్రశ్నించారు. జగన్కు బెయిల్ రాకుండా కుట్ర జరుగుతోందని, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి జగన్కు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాయని ఆమె విమర్శించారు. జీవోలు జారీ చేసిన మంత్రులు తమపై వచ్చినవి ఆరోపణలు మాత్రమే, నేరం రుజువు కాలేదని అంటున్నారని అంటూ అవే ఆరోపణలు ఎదుర్కుంటున్న జగన్కు బెయిల్ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ఆమె అడిగారు.












Click it and Unblock the Notifications