బాబు పాదయాత్ర: తొలి రోజు లోకేష్, మధ్యలో బాలకృష్ణ
ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ కూడా బాబు యాత్ర చేస్తున్న సమయంలో మధ్యలో ఓసారి ఆయనను కలవనున్నారు. యాత్ర ప్రారంభానికి ముందు మంగళవారం రోజు చంద్రబాబు తన ఇంటి నుండి నేరుగా సికింద్రాబాదులోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు వెళ్తారు. ఆక్కడ ఆయనకు నివాళులు అర్పిస్తారు. అక్కడి నుండి ఎన్టీఆర్ ఘాట్కు వెళ్ళి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళి, అటు నుండి అనంతపురం వెళ్తారు.
హిందూపురంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత పాదయాత్రను చేపడతారు. అక్కడ చంద్రబాబు పాదయాత్రకు గుర్తుగా మహాత్మా గాంధీ, స్వర్గీయ నందమూరి తారక రామారావు, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాలను ఆవిష్కరిస్తారు.
కాగా ఆదివారం ఉదయం నందమూరి బాలకృష్ణ బావ చంద్రబాబు ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. బాబుతో బాలయ్య అరగంటకు పైగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పాదయాత్ర ఏర్పాట్లు, యాత్రకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై మాట్లాడారు.