హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కేసు: సిబిఐ జెడితో ఐటి ఆఫీసర్ భేటీ, దూకుడేనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

JD Laxmi Narayana
హైదరాబాద్: ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోమవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) అధికారులతో భేటీ అయ్యారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసును విచారిస్తున్న సిబిఐ జెడి లక్ష్మీ నారాయణతో ఐటి(ఆదాయపు పన్ను) కమిషనర్ భేటీ అయ్యారు. జగన్ కేసులో సిబిఐ కోర్టుకు సమర్పించిన ఛార్జీషీట్‌లపై ఐటి కమిషనర్ కొంత సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ ఆస్తులపై ఇక ఐటి దూకుడుగా వ్యవహరించే అవకాశముందని చెబుతున్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి సిబిఐ నాలుగు ఛార్జీషీట్‌లను కోర్టుకు ఇప్పటి వరకు సమర్పించిన విషయం తెలిసిందే. సిబిఐ జగన్ కేసుకు సంబంధించి ఒక్కో కేసుకు ఒక్కో ఛార్జీషీటును కోర్టుకు సమర్పించింది. అయితే ఇక అన్ని కలిపి ఒకే ఛార్జీషీట్ వేయాల్సి ఉంది. ఇటీవల భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సిబిఐకి ఒకే ఛార్జీషీట్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది.

దీంతో సిబిఐ జగన్ ఆస్తుల కేసులో పలువురిని విచారించి ఒకే ఛార్జీషీట్ ఆఖరున వేసే అవకాశముంది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నప్పుడు కోర్టు సిబికి పలు సూచనలు చేసింది. ఒకే ఛార్జీషీట్ దాఖలు చేయాలని, పదే పదే కోర్టుకు సమర్పించవద్దని, అలాగే కేసును మార్చి 31లోగా పూర్తి చేయాలని ఆదేశించింది.

English summary
IT Commissioner has met CBI Joint Director Laxmi Narayana on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X