ఎర్రన్నాయుడి మృతి: నివేదిక కోరిన సర్వే, చిరు నివాళి

ఆయన ఏ విషయాన్నైనా స్పష్టంగా సూటిగా చెప్పగలిగిన వ్యక్తి అన్నారు. ఆయన మృతితో ఉత్తర, కోస్తాంధ్ర మంచి నేతను కోల్పోయిందని ఆవేదన చెందారు. ఎర్రన్నాయుడు టిడిపి నేతగా కాకుండా తెలుగు ప్రజల నేతగా ఢిల్లీ స్థాయిలో ఎదిగారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు.
ఎర్రన్నాయుడు ఎవరితోనైనా స్నేహపూర్వకంగా ఉండేవారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. ఆయన కేవలం తెలుగుదేశం పార్టీ కోసమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి సారించే వారని, ఉత్తరాంధ్రకు ముఖ్య నేత అన్నారు. ఆయనను కోల్పోవడం తట్టుకోలేక పోతున్నామన్నారు.
మంచి పార్లమెంటేరియన్ను కోల్పోయామని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. ఈ మృతి తనను కలిచి వేసిందని, పార్టీలకతీతంగా ప్రజలు ఆయనను గౌరవిస్తారన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో ఎర్రన్నాయుడు మృతదేహానికి చిరంజీవి, యార్లగడ్డ లక్ష్మీ నారాయణలు నివాళులు అర్పించారు. మృతదేహాన్ని చూసి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ విలపించారు.
నివేదిక అడిగా
ఎర్రన్నాయుడి ప్రమాదంపై తాను అధికారులను నివేదిక అడిగానని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. హైవే అథారిటీ అధికారులది తప్పని తేలితే వారిపై విచారణకు ఆదేశిస్తామన్నారు. హైవే ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. తాను కేంద్రమంత్రిని అయినా తెలంగాణను వదిలేది లేదన్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications