అమ్మ, వదిన ఢిల్లీ ఎందుకెళ్లారో మీకు తెలుసా: షర్మిల

అందుకే ఆయన అవిశ్వాసం పెట్టడం లేదని ధ్వజమెత్తారు. రైతులకు మద్దతు ధర లేక అనేక కష్టాలు పడుతున్నారని విమర్శించారు. తన అమ్మ, పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, తన వదిన భారతి ఢిల్లీ కెళ్లారని, ఆ మర్మమేమిటో చెప్పాలని టిడిపి ప్రశ్నిస్తోందని, వారు అక్కడకు వెళ్లినంత మాత్రాన కుమ్మక్కు అయినట్టా అని ప్రశ్నించారు. వారు ఢిల్లీ ఎందుకు వెళ్లారో టిడిపికి తెలుసా అన్నారు.
తమ లాయర్లు ఢిల్లీలో ఉన్నారని, వారిని కలిసేందుకే వదిన, అమ్మ ఢిల్లీ వెళ్లారన్నారు. కాంగ్రెసుతో కుమ్మక్కయింది మీరు కాబట్టే మీపై కేసులు ఉండవన్నారు. కేసులు ఉండనందుకు ప్రతిఫలంగా మీరు ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. తమకు కాంగ్రెసుతో కుమ్మక్కు కావాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదన్నారు. మాట ఇవ్వడం, దానిపై నిలబడటం అంటే చంద్రబాబుకు ఈ జన్మలో అర్థం కాదన్నారు.
తుఫానుతో ఇంత నష్టం జరిగినా ప్రభుత్వం స్పందించడం లేదని, రాష్ట్రంలో ఉన్నది దున్నపోతు ప్రభుత్వమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వేరుగా ఆరోపించారు. జగన్ అధికారంలోకి వస్తారని, అప్పుడు రైతులకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టి అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. నీలం తుఫానులో నష్టపోయిన ఖమ్మం జిల్లా రైతులను ఆమె పరామర్శించారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications