అమ్మ, వదిన ఢిల్లీ ఎందుకెళ్లారో మీకు తెలుసా: షర్మిల

అందుకే ఆయన అవిశ్వాసం పెట్టడం లేదని ధ్వజమెత్తారు. రైతులకు మద్దతు ధర లేక అనేక కష్టాలు పడుతున్నారని విమర్శించారు. తన అమ్మ, పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, తన వదిన భారతి ఢిల్లీ కెళ్లారని, ఆ మర్మమేమిటో చెప్పాలని టిడిపి ప్రశ్నిస్తోందని, వారు అక్కడకు వెళ్లినంత మాత్రాన కుమ్మక్కు అయినట్టా అని ప్రశ్నించారు. వారు ఢిల్లీ ఎందుకు వెళ్లారో టిడిపికి తెలుసా అన్నారు.
తమ లాయర్లు ఢిల్లీలో ఉన్నారని, వారిని కలిసేందుకే వదిన, అమ్మ ఢిల్లీ వెళ్లారన్నారు. కాంగ్రెసుతో కుమ్మక్కయింది మీరు కాబట్టే మీపై కేసులు ఉండవన్నారు. కేసులు ఉండనందుకు ప్రతిఫలంగా మీరు ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. తమకు కాంగ్రెసుతో కుమ్మక్కు కావాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదన్నారు. మాట ఇవ్వడం, దానిపై నిలబడటం అంటే చంద్రబాబుకు ఈ జన్మలో అర్థం కాదన్నారు.
తుఫానుతో ఇంత నష్టం జరిగినా ప్రభుత్వం స్పందించడం లేదని, రాష్ట్రంలో ఉన్నది దున్నపోతు ప్రభుత్వమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వేరుగా ఆరోపించారు. జగన్ అధికారంలోకి వస్తారని, అప్పుడు రైతులకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టి అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. నీలం తుఫానులో నష్టపోయిన ఖమ్మం జిల్లా రైతులను ఆమె పరామర్శించారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications