వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మజ్లిస్ పార్టీ: ఒకేలా స్పందించిన నారా లోకేష్, షర్మిల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nara Lokesh and Sharmila
హైదరాబాద్/కర్నూలు: కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలన్న మజ్లిస్ పార్టీ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలలు అభినందించారు. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెసు ప్రభుత్వాలకు మద్దతు ఉపసంహరించడం సరైనదని వారు అభిప్రాయపడ్డారు.

నారా లోకేష్ ట్విట్టర్‌లో మజ్లిస్ నిర్ణయాన్ని స్వాగతించారు. తాను అసదుద్దీన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, ముస్లింలకు న్యాయం చేయడంలో కాంగ్రెసు ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెసు శాంతిని పెంపొందించలేకపోతోందని, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి రిజర్వేషన్ బిల్లును పాస్ చేయలేక పోయారని ట్విట్టర్‌లో విమర్శించారు.

కర్నూలు జిల్లా మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో షర్మిల మజ్లిస్ నిర్ణయాన్ని స్వాగతించారు. బుధవారం షర్మిల పాదయాత్ర ఆదోనికి చేరుకుంది. ఈ సమయంలో ఆమె మాట్లాడుతూ... మజ్లిస్ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, కిరణ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని, కాబట్టి తెలుగుదేశం వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా ఆదోనిలో ఉన్న షర్మిలను వైయస్ విజయమ్మ కలుసుకున్నారు.

English summary
MIM president Asaduddin Owaisi's decision to sever ties with the Congress has been lauded by both the Telugudesam and the YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X