వోటింగ్‌కు రెడీ: మెజారిటీ ఉందన్న ప్రధాని

Manmohan Singh
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలను సజావుగా నడిపించడానికి యుపిఎ ప్రభుత్వం కాస్తా దిగి వచ్చినట్లు కనిపిస్తోంది. రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడంపై మంగళవారం నాలుగో రోజు వరుసగా పార్లమెంటు ఉభయసభలు అట్టుడికి గురువారానికి వాయిదా పడ్డాయి. దీంతో మంగళవారం యుపిఎ సమన్వయ కమిటీ భేటీ జరిగింది. రిటైల్ రంగంలో ఎఫ్‌డిఐల అనుమతిపై ఏ నిబంధన కిందనైనా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ చెప్పారు.

తాము వోటింగుకు సిద్ధంగానే ఉన్నామని ఆయన చెప్పారు. ఏ నిబంధన కింద చర్చకు అనుమతించాలనేది లోకసభ స్పీకర్ ఇష్టమని ఆయన అన్నారు. యుపిఎ సమన్వయ కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమన్వయ కమిటీ సమావేశంలో యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీతో పాటు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ పాల్గొన్నారు.

ఎఫ్‌డిఐలపై యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని డిఎంకె మంగళవారం ప్రకటించింది. దీంతో కాంగ్రెసుకు ఊరట లభించినట్లయింది. మతతత్వవాదులు అధికారంలోకి రాకుండా ఉండడానికి యుపిఎకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు డిఎంకె తెలిపింది. ఎఫ్‌డిఐల వ్యవహారంపై యుపిఎకు, తమకు మధ్య వంద విభేదాలు ఉన్నా ఈ ప్రభుత్వం పడిపోతే తలెత్తే విపత్కర పరిణామాలను అడ్డుకోవడానికి నిర్ణయించుకున్నట్లు డిఎంకె అధినేత కరుణానిధి తెలిపారు.

ఎఫ్‌డిఐలపై వోటింగ్‌కు కూడిన చర్చ జరిగినా తమకు అభ్యంతరం లేదని సమన్వయ కమిటీ సమావేశానంతరం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. తగిన సంఖ్యాబలం తమకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. స్పీకర్ ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా యుపిఎ ఈ విషయంలో ఏకతాటి మీద నడుస్తుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+