75 అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లు గెలుస్తాం: కెసిఆర్
పల్లెబాట కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకరి చొప్పున నియమించిన పార్టీ సమన్వయకర్తల సమావేశం, గ్రేటర్ హైదరాబాద్లోని 150 డివిజన్ల 'నగర బాట' ఇన్చార్జిలు, 24 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిల భేటీలు మంగళవారం పార్టీ కార్యాలయం తెలంగాణభవన్లో వేర్వేరుగా జరిగాయి. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు.
బూత్స్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేసుకోవాలని, స్థానిక సంస్థలు, సహకార ఎన్నికల్లోనూ విజయం సాధించేలా సంస్థాగత నిర్మాణం ఉండాలని చెప్పారు. హైదరాబాద్లోనూ బలాన్ని నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇక నుంచి హైదరాబాద్లో పార్టీ పనితీరును తానే పర్యవేక్షిస్తానని చెప్పారు. కాగా, ఈ సమావేశానికి హాజరుకాని పార్టీ బాధ్యులపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయటమే కాక, వారిని ఫోన్ చేసి మరీ పిలిపించారు.
తెరాస ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 10 రోజుల పాటు హైదరాబాద్లో బస్తీ బాట కార్యక్రమం జరుగుతుందని పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ కర్నె ప్రభాకర్ సమావేశానంతరం మీడియా ప్రతినిధుల సమవేశంలో ప్రకటించారు. మంగళవారం తెలంగాణ భవన్లో పార్టీ నేతలు రామ్మోహన్, కిషోర్, శ్రీనివాస్రెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.