వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

75 అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లు గెలుస్తాం: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తమ పార్టీ రోజురోజుకూ బలం పుంజుకుంటోందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా 75 అసెంబ్లీ, 15 లోక్‌సభ స్థానాలను తమ పార్టీ గెలుస్తుందని అన్ని సర్వేలూ చెబుతున్నాయని, పార్టీ శ్రేణులు గట్టిగా శ్రమిస్తే మరో 25 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

పల్లెబాట కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకరి చొప్పున నియమించిన పార్టీ సమన్వయకర్తల సమావేశం, గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్ల 'నగర బాట' ఇన్‌చార్జిలు, 24 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిల భేటీలు మంగళవారం పార్టీ కార్యాలయం తెలంగాణభవన్‌లో వేర్వేరుగా జరిగాయి. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు.

బూత్‌స్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేసుకోవాలని, స్థానిక సంస్థలు, సహకార ఎన్నికల్లోనూ విజయం సాధించేలా సంస్థాగత నిర్మాణం ఉండాలని చెప్పారు. హైదరాబాద్‌లోనూ బలాన్ని నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇక నుంచి హైదరాబాద్‌లో పార్టీ పనితీరును తానే పర్యవేక్షిస్తానని చెప్పారు. కాగా, ఈ సమావేశానికి హాజరుకాని పార్టీ బాధ్యులపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయటమే కాక, వారిని ఫోన్ చేసి మరీ పిలిపించారు.

తెరాస ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 10 రోజుల పాటు హైదరాబాద్‌లో బస్తీ బాట కార్యక్రమం జరుగుతుందని పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ కర్నె ప్రభాకర్ సమావేశానంతరం మీడియా ప్రతినిధుల సమవేశంలో ప్రకటించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలు రామ్మోహన్, కిషోర్, శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

English summary

 Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao was confident of winning 75 assembly seats and 15 Loksabha seats in coming election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X