ఓ పనై పోయింది...!: సుజన రాజీనామా తిరస్కరణ

కాగా తెలుగుదేశం పార్టీలో చిచ్చు రాజుకుంది. రాజ్యసభకు గైర్హాజరై విమర్శల పాలైన రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ వ్యాపారవేత్త సుజనా చౌదరి ఆదివారం తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పంపించిన విషయం తెలిసిందే. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డిఐ)పై రాజ్యసభలో ఓటింగు జరుగుతున్న సమయంలో తాను గైర్హాజరు కావడంపై ఇప్పటికే వివరణ ఇచ్చానని, క్షమాపణలు చెప్పానని అన్నారు.
తాను క్షమాపణలు చెప్పినప్పటికీ కొందరి నేతల మాట తీరు తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. పార్టీలో జరుగుతున్న తీరుపై తాను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు లేఖ రాశానని చెప్పారు. తాను ఎంపి పదవికి రాజీనామా చేసినప్పటికీ తెలుగుదేశంలో యధావిధిగా కొనసాగుతానని చెప్పారు. కొందరు పార్టీ నేతల మాటలు తనను మానసికంగా బాధించాయని సుజనా చౌదరి అన్నారు. టిడిపి సిద్ధాంతాలు గౌరవించే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, దేవేందర్ గౌడ్, గుండు సుధారాణిలు ఎఫ్డిఐ ఓటింగు సమయంలో గైర్హాజరయ్యారు. దీనిపై పార్టీకి చెందిన సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, కొత్తకోట దయాకర్ రెడ్డి, యనమల రామకృష్ణుడు తదితరులు ధ్వజమెత్తారు. ఇతర పలువురు నేతలు కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. దీంతో ఆయన రాజీనామా చేశారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications