టాప్లో క్రైస్తవం: రెండు,మూడు స్థానాల్లో ఇస్లాం, హిందు
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్నారు. ఇస్లాం రెండో స్థానంలో, హిందువులు మూడో స్థానంలో ఉన్నారు. మంగళవారం ప్యూ ఫోరం ఆన్ అనే సంస్థ ప్రపంచంలో ఏ మతం జనాభా ఎంత ఉందో విడుదల చేసింది. 2.2 బిలియన్ల (220కోట్లు)తో క్రిస్టియన్ జనాభా మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో క్రిస్టియన్ల శాతం 32గా ఉంది. ఆ తర్వాత స్థానంలో ముస్లిం వర్గం ఉంది.
ముస్లింలు 1.6 బిలియన్(160కోట్లు)తో రెండో స్థానంలో ఉన్నారు. వంద కోట్లకు పైగా హిందువులు ఉన్నారు. ప్రపంచంలో హిందువుల శాతం 15గా ఉంది. ఆ తర్వాత స్థానంలో బుద్దిస్టులు 500 మిలియన్లు, జ్యూస్ 14 మిలియన్స్ ఉన్నారు. బుద్దిస్టులది ఏడు శాతంగా, జ్యూస్లది 0.2 శాతంగా ఉంది.
ప్రపంచంలోని ఎనిమిది ప్రధాన మతాలపై ప్యూ ఫోరం తన డేటాను విడుదల చేసింది. 230 కంటే ఎక్కువ దేశాల నుండి ఈ సమాచారాన్ని సేకరించింది. ప్రతి పది మందిలో ఎనిమిది అంతకంటే ఎక్కువ మంది ప్రజలు ఏదో ఒక మతంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 580 కోట్ల మంది ప్రజలు మత సమూహంలో ఉన్నారు. ఆఫ్రికన్ ట్రెడిషన్స్లో ఉన్న వారిని కలుపుకొని దాదాపు 400 మిలియన్ల ప్రజలు ఫోక్ ట్రెడిషన్ను కలిగి ఉన్నారు.