అలీయే బినామీ, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు: సిబిఐ

గాలి సూచనల మేరకే అలీ ఖాన్ ముడి ఇనుము విక్రయాలు చేశారని, అందుకు అనుగుణంగా కొందరు అధికారులతో లాలూచీ వ్యవహారాలు నడిపించారని తెలిపింది. వీరితోపాటు మరికొందరు ప్రైవేటు వ్యక్తుల పాత్రపై దర్యాప్తు చేయాలని పేర్కొంది. అలీఖాన్ను ఓఎంసి కేసులో రిమాండ్కు తరలించిన 90వ రోజున సిబిఐ అనుబంధ చార్జ్షీట్ దాఖలు చేసింది. ఓఎంసి కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని తెలిపింది.
అలీ ఖాన్ ప్రారంభించిన మైనింగ్ కంపెనీ దేవీ ఎంటర్ప్రైజెస్ ద్వారా విక్రయించిన ముడి ఇనుము గురించి, ఆ సంస్థ ఇతర మైనింగ్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని అమ్మిన ఖనిజం గురించి కోర్టుకు కొన్ని వివరాలు అందించినట్లుగా సమాచారం. ఈ క్రమంలో ఇనుప ఖనిజాన్ని ఓఎంసి నుంచి కొని, ఆ సంస్థకు చెల్లించిన నగదు వివరాలను రాబట్టాల్సి ఉందని సిబిఐ పేర్కొంది. దీనికోసం బళ్లారిలో ఓఎంసికి చెందిన బ్యాంకు ఖాతాలపై దృష్టిపెట్టామని... ఆయా బ్యాంకు శాఖ మేనేజర్లను ప్రశ్నించాలని తెలిపింది.
బ్యాంకు మేనేజర్లు, ఆయా కంపెనీల ప్రతినిధులతో కలిపి మొత్తం 36 మందిని సాక్షులుగా చూపింది. 47 పేజీల చార్జ్షీట్తో 67 డ్యాకుమెంట్లు, సుమారు 3 వేల అనుబంధ పత్రాలను నాంపల్లి సిబిఐ కోర్టుకు అధికారులు సమర్పించారు. తాము ఆ కంప్యూటర్ను సేకరించి, అందులోని సమాచారాన్ని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ద్వారా తిరిగి రాబట్టగలిగామని చార్జ్షీట్లో అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.
ఈ కేసులో రెండో నిందితుడిగా ఎ2 గాలి జనార్దన్రెడ్డి, ఎ7 అలీఖాన్ పాత్ర కీలకమని... ఆ వివరాలు తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అలీ ఖాన్ పాత్రకు సంబంధించి ఇదే ఆఖరు చార్జ్షీట్ అని చెప్పలేమంది. ఇనుప ఖనిజం విక్రయించగా వచ్చిన సొమ్ము అంతిమంగా ఎక్కడకు చేరిందో తెలియాల్సి ఉందని నివేదించారు. ఓఎంసి పేరుతో తవ్విన ముడి ఇనుమును ఎక్కడికి తరలించారో అలీ ఖాన్కు తెలుసని, అంతకుముందు ఆయన కొన్ని మైనింగ్ కంపెనీలపై ఒత్తిడి తెచ్చి, తమకే ముడి ఇనుము అమ్మాలని డిమాండ్ చేశారని చార్జ్షీట్లో పేర్కొన్నారు.
అలా ఆయన నుంచి ఒత్తిడి ఎదుర్కొన్న వారిని సిబిఐ సాక్షులుగా చూపినట్లు తెలుస్తోంది. ఈ వివరాలను వెల్లడించే ముందు ఈ కేసులో అలీ ఖాన్ పాత్ర ఎంత ముఖ్యమైనదో సిబిఐ అధికారులు కోర్టుకు వివరించారు. ఓఎంసిలో ద్వారా ఆర్జించిన సొమ్మును అలీ ఖాన్ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులుగా మార్చారని తెలిపినట్లుగా సమాచారం. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో రూ.50 కోట్లతో 200 ఎకరాలు కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్నారని, ఆదాయపు పన్ను శాఖకు రూ.68 కోట్ల ఆదాయాన్ని చూపారని, దీనికి సంబంధించి దర్యాఫ్తు కొనసాగుతోందని పేర్కొంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications