వైయస్ అల్లుడు అనిల్కు ఖమ్మం కోర్టు సమన్లు

గతంలోనూ ఇవే ఆదేశాలతో సమన్లు జారీ అయ్యాయి. అయితే, హైదరాబాద్లోని చిరునామాలో అందుబాటులో లేకపోవడంతో అవి ఆయనకు అందలేదు. దీంతో మళ్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. అనిల్కు వాటిని అందజేసేందుకు పోలీసులు శుక్రవారం కోర్టు నుంచి సమన్లు తీసుకున్నట్లు సమాచారం.
2009 ఎన్నికల సందర్భంగా అనిల్కుమార్ ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి చర్చిలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన చర్చిలో ప్రార్థనలు జరిపి, ఓటర్లను లోబర్చుకునే నిమిత్తం డబ్బు పంపిణీకి యత్నించారని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు, పత్రికల్లో వార్తలొచ్చాయి.
వాటి ఆధారంగా ఖమ్మం రూరల్ పోలీసులు అనిల్తో పాటు మరో ముగ్గురిపై సుమోటోగా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి అనిల్ మినహా మిగిలిన ముగ్గురు సరిగానే వాయిదాలకు హాజరవుతున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అనిల్ను కోర్టుకు రప్పించేందుకే సమన్లు జారీ చేశారు.












Click it and Unblock the Notifications