వైయస్ అల్లుడు అనిల్‌కు ఖమ్మం కోర్టు సమన్లు

Anil Kumar
ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అల్లుడు మరుసుబల్లి అనిల్‌కుమార్‌కు ఖమ్మం రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సమన్లు జారీ చేసింది. మత ప్రచారం ముసుగులో ఓటర్లను ప్రలోభపెట్టారనే ఆరోపణలపై ఖమ్మం రూరల్ పోలీసులు అనిల్‌పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఫిబ్రవరి 14న కోర్టుకు హాజరై సమాధానం ఇవ్వాలని న్యాయమూర్తి ఎ.సునీతారాణి ఆదేశిస్తూ సమన్లు జారీ చేశారు.

గతంలోనూ ఇవే ఆదేశాలతో సమన్లు జారీ అయ్యాయి. అయితే, హైదరాబాద్‌లోని చిరునామాలో అందుబాటులో లేకపోవడంతో అవి ఆయనకు అందలేదు. దీంతో మళ్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. అనిల్‌కు వాటిని అందజేసేందుకు పోలీసులు శుక్రవారం కోర్టు నుంచి సమన్లు తీసుకున్నట్లు సమాచారం.

2009 ఎన్నికల సందర్భంగా అనిల్‌కుమార్ ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి చర్చిలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన చర్చిలో ప్రార్థనలు జరిపి, ఓటర్లను లోబర్చుకునే నిమిత్తం డబ్బు పంపిణీకి యత్నించారని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు, పత్రికల్లో వార్తలొచ్చాయి.

వాటి ఆధారంగా ఖమ్మం రూరల్ పోలీసులు అనిల్‌తో పాటు మరో ముగ్గురిపై సుమోటోగా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి అనిల్ మినహా మిగిలిన ముగ్గురు సరిగానే వాయిదాలకు హాజరవుతున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అనిల్‌ను కోర్టుకు రప్పించేందుకే సమన్లు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+