జై ఆంధ్రప్రదేశ్తో సంబంధంలేదు, మిత్రుడనివచ్చా: బొత్స
ఇక్కడ జరిగిన విషయాన్ని పార్టీ అధిష్టానానికి తాను వివరిస్తానని చెప్పారు. ఆ తర్వాత పార్టీ నిర్ణయమే అంతిమం అన్నారు. తెలంగాణపై కేంద్రం, పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. ఉండవల్లి మిత్రుడిగా పిలిచినందువల్లే తాను ఈ సభకు వచ్చానని చెప్పారు. ఇది ఆయన వ్యక్తిగతం అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ తలపెట్టిన జై ఆంధ్రప్రదేశ్ సభ ద్వారా తమ సమైక్యవాదాన్ని తమ పార్టీ అధిష్టానానికి బలంగా వినిపిస్తామని మంత్రి శైలజానాథ్ అన్నారు.
నేడు సాయంత్రం సభ
ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు రాజమండ్రిలోని సుబ్రహ్మణ్య మైదానంలో స్థానిక పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జై ఆంధ్రప్రదేశ్ సభ జరగనుంది. ఈ సభలో ఉండవల్లి ముప్పై ఏళ్ల క్రితం తాము జై ఆంధ్ర ఎందుకు అన్నామో? ఇప్పుడు ఎందుకు జై ఆంధ్రప్రదేశ్ అంటున్నామో? వివరించనున్నారు.
ఈ సభకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు, పదిమంది మంత్రులు, ఆరుగు పార్లమెంటు సభ్యులు రానున్నారని తెలుస్తోంది. సమైక్యాంధ్ర కోరుకునే మేధావులు, పలు పార్టీలకు చెందిన నేతలు కూడా రానున్నారు. అందరూ సమైక్యాంధ్ర ఆవశ్యకత పైన మాట్లాడనున్నారు.