అరెస్ట్కి సిగ్గుపడం, జగన్లా లక్షకోట్లు దోచామా?: హరీష్
అరెస్టు చేయాల్సిన పరిస్థితి వస్తే మొదట తెరాసకు చెందిన ఇరవై మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసి ఆ తర్వాత కార్యకర్తల జోలికి వెళ్లాలన్నారు. బందులో ఏం జరిగినా మంత్రి డికె అరుణదే బాధ్యత అన్నారు. జిల్లాకు చెందిన మంత్రిగా మహబూబ్ నగర్ జిల్లాలో తలపెట్టిన సడక్ బందుకు ఆమె అనుమతి ఇప్పించాలని డిమాండ్ చేశారు. సడక్ బందును శాంతియుతంగా నిర్వహిస్తామని ప్రభుత్వం అనుమతి నిరాకరించడం సరికాదన్నారు.
సడక్ బందుకు ప్రతి పది కిలోమీటర్కు ఒక ఎమ్మెల్యేను ఇంచార్జీగా నియమించామని ఆయన తెలిపారు. సడక్ బంద్ను శాంతియుతంగా నిర్వహిస్తామని, ప్రభుత్వం అణిచివేయాలని చూస్తే సర్కారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి ఉంటుందని హరీష్రావు హెచ్చరించారు. అనుకోనిది జరిగితే తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
సడక్ బంద్ సెగ ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తగిలేలా నిర్వహించాలన్నారు. బైండోవర్ కేసులు పెట్టి అడ్డుకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. కేసులు పెట్టి జైల్లో పెడితే గర్వపడతామే కానీ, సిగ్గుపడమన్నారు. సడక్ బందులో తెలంగాణవాదులపై లాఠీఛార్జ్ జరిగితే జిల్లా డికె అరుణ బాధ్యత వహించాలన్నారు. విధ్వంసం, హింస తమ లక్ష్యం కాదన్నారు. అనుమతిస్తే ప్రశంతంగా సడక్ బందు సాగుతుందన్నారు. అనుతివ్వకుండే 24 గంటల పాటు రోడ్ల పైనే బైఠాయిస్తామన్నారు.