మీ కుటుంబమంతా నీచులే: శోభా హైమావతి కౌంటర్
గుమాస్తా పని ఇచ్చి అన్నం పెట్టిన గని యజమానినే చంపిన మీ మామ పెద్ద నీచుడని, ప్రజలు నమ్మి అధికారం ఇవ్వగా, కొడుక్కి రాష్ట్రాన్ని దోచి పెట్టిన మీ భర్త, ఐఏఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలను జైలుపాలు చేసిన మీ కొడుకు జగన్, మత ప్రచారం చేస్తున్నట్లు పైకి కనిపిస్తూ లక్షల ఎకరాల్లో గనులను సొంత ఆస్తిలా రాయించుకోవాలని చూసిన నీ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్, మేయర్గా ఉండి రైతులకు చెందాల్సిన ఎరువులను నల్ల బజారులో అమ్ముకొన్న నీ తమ్ముడు.. ఇలా మీ వాళ్లే నీచులని, మీ కుటుంబానిదే పెద్ద నీచ చరిత్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విచారణకు వర్ల డిమాండ్
వీరభద్రా రెడ్డి లేఖలో అంశాలపై లోతుగా దర్యాప్తు జరపాలని టిడిపి నేత వర్ల రామయ్య డిమాండ్ వేరుగా విజయవాడలో డిమాండ్ చేశారు. చేశారు. కొండల రావు తన పేరిట 40 ఎకరాల భూమి రాసినట్లు వీరభద్ర ఆ లేఖలో పేర్కొన్నారని, ఈ కొండల రావు ఎవరు, ఆ భూమి అతనికి ఎలా వచ్చిందనేది తేల్చాలని, వైయస్ ముఖ్యమంత్రి కాకముందు కొండల రావు స్థితి ఏమిటో విచారించాలన్నారు.
చిన్న రేకుల షెడ్డులో ఉండే బ్రదర్ అనిల్ కుమార్ ప్రత్యేక పరిస్థితుల్లో వైయస్కు అల్లుడయ్యారన్నారు. కొండల రావు కూడా అనిల్కు పరిచయం అయ్యేనాటికి తెల్లరేషన్ కార్డుదారేనన్నారు. వీరభద్రా రెడ్డి పేరుమీద రూ.20లక్షల షేర్లు, ఆయన తండ్రి పేరిట రూ.32 లక్షల షేర్లు ఉన్నాయన్నారు. ఇదంతా వీరభద్రా రెడ్డికే తెలియదన్నారు. కొండల రావు తన బినామీ కాదని అనిల్ గుండెమీద చేయి వేసుకుని చెప్పగలరా? అని సవాల్ విసిరారు. మామ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు కూడబెట్టుకోవడం నిజంకాదా? అని నిలదీశారు.