ఆటోలో రెండు గంటలు తిప్పి... యువతిపై గ్యాంగ్ రేప్
ఆమెను ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం బలవంతంగా తీసుకు వెళ్లారని చెప్పారు. దాదాపు రెండు గంటల పాటు తిప్పారు. దస్నా ప్రాంతంలో ఆ అమ్మాయిని ఓ ప్రాంతానికి తీసుకు వెళ్లి అత్యాచారం చేశారు. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్, దోపిడీ, అత్యాచారం కింద వారిపైన కేసును నమోదు చేశారు. నిందితులు ఆటోను ఘజియాబాదులోని మసూరి నుండి దొంగిలించుకొని వచ్చినట్లుగా గుర్తించారు.
బాధితారాలికి పోలీసులు వైద్య పరీక్షల చేయించారు. అత్యాచారానికి గురైనట్లుగా గుర్తించారు. బాధితురాలు త్రిలోకపురిలో తన సోదరుడు, సోదరితో కలిసి ఉంటోంది. వీరి తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం ఓ ప్రమాదంలో మృతి చెందారు. శనివారం రాత్రి బాధితురాలు షిప్రా మాల్లో స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లింది.
మాల్లో స్నేహితురాలిని కలిసిన అనంతరం బాధితురాలు ఇంటికి వెళ్లేందుకు ఓ ఆటో కోసం నిరీక్షిస్తుండగా ఈ ముగ్గురు నిందితులు ఆమెను టార్గెట్ చేశారు. ఆటోలో వచ్చిన ముగ్గురు ఆమెను ఎక్కించుకొని ఆ తర్వాత ఓ ప్రాంతానికి తీసుకు వెళ్లి అత్యాచారం చేశారు.