యువతిని ఎత్తుకెళ్లి కొట్టారు..ఆపై ఆరుసార్లు అత్యాచారం
వెంటనే స్పందించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ముగ్గురు ధీరజ్, ముఖేష్, దేవేందర్లుగా గుర్తించారు. వారు వసంత్ కుంజ్ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. తాను మంగళవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా ప్రియా సినిమా హాలు వద్ద ఇద్దరు నిందితులు తనను బలవంతంగా వారి ద్విచక్ర వాహనంపై తీసుకు వెళ్లారని పోలీసులకు బాధితారాలు తెలిపింది.
నిందితులు తనను బలవంతంగా ఓ గదిలోకి తీసుకు వెళ్లారని, అక్కడ అప్పటికే మూడో వ్యక్తి ఉన్నాడని, వారు ముగ్గురు కలిసి తనను కొట్టి, తనపై బలవంతంగా ఆరుసార్లు అత్యాచారం చేశారని ఆరోపించింది. ఆ తర్వాత వారు తనను వసంత్ కుంజ్లోని ఓ గురుద్వార వద్ద పడేసి వెళ్లిపోయారని ఆరోపించింది. అనంతరం తాను పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు చెప్పింది.
మూడేళ్ల బాలికపై దాష్టీకం
కేరళలోని తిరూర్లో మూడేళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకు వెళ్లి ఆపై ఆత్యాచారం చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో తల్లితో పాటు పడుకొని ఉండగా దుండగులు ఎత్తుకెళ్లారు. తల్లి తీవ్ర జ్వరంతో బాధపడుతూ నిద్రించింది. దీంతో వారు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.