బాబుపై దాడి ఎదురుదాడి, రాజీనామాలు: అనంతలోనూ

మండలిలో పార్టీ ప్రతిష్ట నిలబడేలా తాను చేశానన్నారు. యనమల రామకృష్ణుడు అభ్యర్థిత్వానికి తాను వ్యతిరేకం కాదని కానీ, ఆయన మొదట లోకసభ లేదా రాజ్యసభకు వెళ్తానని చెప్పారన్నారు. పని చేసే వాళ్లను గుర్తించనప్పుడు పార్టీ అధ్యక్షుడు ఎన్ని మైళ్ల పాదయాత్ర చేసినా ప్రయోజనం లేదన్నారు. తాను పదవి కోసం ఆరాటపడటం లేదని కానీ, అప్పటికప్పుడు చెప్పడం తనను బాధించిందన్నారు.
చివరి నిమిషంలో తాను పనికి రానని అభిప్రాయపడటం బాధించిందన్నారు. తనకు కనీస మర్యాద ఇవ్వనందుకే తాను బాధపడుతున్నానని చెప్పారు. తాము ధనికులం కాకపోవచ్చునని కానీ గౌరవం మాత్రం కావాలని హితవు పలికారు. నిబద్దత కలిగిన కార్యకర్తగా పార్టీలో పని చేస్తానన్నారు. దాడి పదవులకు రాజీనామా చేసే యోచనలో ఉన్నారట. చంద్రబాబు పైన ఎదురుదాడికి దిగడంతో ఆయన పొలిట్ బ్యూరోకు రాజీనామా చేయవచ్చునని అంటున్నారు.
కాగా, తెలుగుదేశంలో శాసన మండలి చిచ్చు మరింత రాజుకున్న విషయం తెలిసిందే. యనమల రామకృష్ణుడు, సలీం, శమంతకమణిని శాసనమండలి అభ్యర్థులుగా ఎంపిక చేసి, సీనియర్ను అయిన తనను ఎంపిక చేయక పోవడంతో దాడి వీరభద్ర రావు అసంతృప్తికి గురయ్యారు. ఆయన ఎమ్మెల్సీ పదవి మరో రెండు నెలలు ఉంది. అయినప్పటికీ తనను పరిగణలోకి తీసుకోక పోవడంతో రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారట.
ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయనున్నారట. మరోవైపు దాడి వీరభద్ర రావుకు మరోసారి అవకాశం ఇవ్వలేదన్న అసంతృప్తితో విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గం టిడిపి నేతలు రాజీనామాలు చేశారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల అధ్యక్షులు తమ రాజీనామాలను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు.
అంతకుముందు దాడిని బుజ్జగించేందుకు పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు నామా నాగేశ్వర రావు, సుజనా చౌదరిలు రంగంలోకి దిగారు. వరుస రాజీనామాల నేపథ్యంలో నష్ట నివారణ చర్యకు వారు సిద్దమయ్యారు. దాడిని వారు బుజ్జగిస్తున్నారు. అయితే, తాను పదవి కోసమే అలకబూనలేదని, తనకు మొదటనే విషయాన్ని చెబితే బావుండేదని, సమావేశంలో అప్పటికప్పుడు చెప్పడం తనలాంటి సీనియర్కు బాధ అనిపించిందని ఆయన చెబుతున్నారట.
యనమల రామకృష్ణుడి ఖరారు అప్పటికప్పుడే జరిగిందని, ముందుగా అనుకొని చేసింది కాదని, అందుకే అలా చేశారని సీనియర్ నేతలు బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది. సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకొని ఇది అప్పటికప్పుడు జరిగిందే తప్ప అవమానపర్చే ఉద్దేశ్యమేదీ లేదని చెప్పారట. మరోవైపు శమంతకమణిని అభ్యర్థి ప్రకటించడం అనంతపురం జిల్లాలో అసంతృప్తిని రాజేసింది. శమంతకమణి పేరును వెనక్కి తీసుకోకుంటే తాము రాజీనామాలు చేస్తామని జిల్లాలోని పలువురు నేతలు హెచ్చరించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications