జగన్ ఆస్తుల కేసు: జగతి పబ్లికేషన్స్కు ఈడి నోటీసులు
ఛార్జీషీట్ నుండి తొలగించాలని సాయి పిటిషన్
జగన్ అక్రమాస్తుల కేసులో రెండో ఛార్జీషీటు నుంచి తనను తొలగించాలని విజయ సాయి రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విజయ సాయి రెడ్డి పిటిషన్ పైన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఏప్రిల్ 1వ తేదికి వాయిదా వేసింది.
జగన్ రిమాండ్ పొడిగింపు
జగన్ అక్రమాస్తులు, ఎమ్మార్, ఓఎంసి కేసులలో నిందితుల రిమాండును సిబిఐ కోర్టు బుధవారం పొడిగించింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి, సునీల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల రిమాండును ఏప్రిల్ ఒకటో తేది వరకు కోర్టు పొడిగించింది. ఎమ్మార్, వాన్పిక్, ఛార్జీషీట్లలో అభియోగాల నమోదుపై సిబిఐ వాదనలు పూర్తయ్యాయి.
సిబిఐ కోర్టుకు మంత్రి ధర్మాన హాజరు
జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి ధర్మాన ప్రసాద్ రావు బుధవారం ఉదయం సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్ ఆస్తులు, ఎమ్మార్ కేసుల్లో నిందితులుగా ఉన్న విజయ సాయి రెడ్డి, బిపి ఆచార్య కూడా సిబిఐ కోర్టుకు హాజరయ్యారు.