జగన్ 'సాక్షి'కి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ
వాటిని యథాతథంగా ప్రచురించి సాక్షి దిన పత్రిక సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు శాసనసభ కార్యదర్శి రాజా సదారాం నోటీసులు జారీ చేశారు. తక్షణమే దీనిపై వివరణ ఇవ్వాలంటూ గురువారం సాయంత్రం సాక్షి పత్రిక ఎడిటర్కు పంపిన నోటీసులో పేర్కొన్నారు. సభా గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించినందుకే ఆ పత్రికకు హక్కుల నోటీసు ఇచ్చినట్లు సదారాం తెలిపారు.
సిబిఐ దుర్వినియోగం
తమను వ్యతిరేకించే వారి పైన కాంగ్రెసు పార్టీ సిబిఐని ఉసిగొల్పుతోందని సిపిఎం ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తాజాగా డిఎంకె నేత స్టాలిన్ ఇంట్లో సోదాలు నిర్వహించడం సిబిఐను కేంద్రం దుర్వినియోగపరుస్తున్న తీరుకు నిదర్శనం అన్నారు. తమను వ్యతిరేకిస్తే కేసులు, జైళ్లు అనే ధోరణిలో కాంగ్రెసు పార్టీ వ్యవహరిస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. సిబిఐపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు.
ఉద్యమకారులపైనే చట్టాలా?
తెలంగాణపై మాట ఇచ్చి తప్పిన కాంగ్రెసు పార్టీ పైన కేసులు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. సడక్ బందులో ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారుల పైనే చట్టాలు గుర్తుకు వస్తాయా అని ప్రశ్నించారు. అంతకుముందు తెరాస సభ్యులు సిఎం చాంబర్ ఎదుట ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వానికి సంబంధం లేదు
సడక్ బందులో తెలంగాణ ఉద్యమకారుల అరెస్టుతో ప్రభుత్వానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అన్నారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా పోలీసులు కేసులు పెట్టారన్నారు. ఈ అంశంపై రేపు అసెంబ్లీలో మాట్లాడాలని సూచించారు.