భారత్కు ఒంటరిగా వెళ్లను: హోటల్ నుండి దూకిన గర్ల్
ఈ సందర్భంగా లండన్లో మీడియాతో మాట్లాడింది. లైంగిక వైధింపుల పైన మాట్లాడేందుకు బాధితులు భయపడతారని, తాను మాత్రం అలా కాదని పేర్కొంది. ఘటన జరిగే సమయంలో తాను సహాయం కోసం గంట పాటు అరిచినా స్పందన లేదని పేర్కొంది. హోటల్లో బస చేసిన వారెవరూ స్పందించలేదంది. వారి ప్రవర్తన పైన తనకు తీవ్రంగా అసహ్యం వేసిందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.
తనపై అత్యాచారయత్నం జరిగిందని సాక్ష్యం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. హోటల్లో ఒంటరిగా ఉన్న తాను రక్షణపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని, తనను నిద్రలేపే పేరుతో వచ్చిన వారిద్దరు తనపై అత్యాచారం చేయాలనే ఉద్దేశ్యంతోనే వచ్చారని పేర్కొంది. అది గమనించే తాను అరిచానని, ఆ తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేశానని తెలిపింది.
కాగా, ఓ బ్రిటిష్ పర్యాటకురాలి పైన ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలోని ఓ హోటల్ సిబ్బంది అఘాయిత్యం చేయబోగా, ఆమె మొదటి అంతస్తు నుండి దూకేసిన ఘటన వారం రోజుల క్రితం జరిగిన విషయం తెలిసిందే. హోటల్ భవంతి పై అంతస్తు కిటికీ నుండి కిందకు దూకడంతో ఆమె కాలికి గాయమైంది.