గవర్నర్, సిఎం: హోలీ హోలీల రంగహోలీ (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హోలీ పండుగ సందర్భంగా రంగుల్లో మునిగి తేలారు. బుధవారంనాడు ప్రజలు ఆనందోత్సాహాల మధ్య పండుగను నిర్వహించుకున్నారు. పరస్పరం రంగులు చల్లుకుంటూ తమ ప్రేమానురాగాలను వ్యక్తం చేసుకున్నారు. హైదరాబాదులో రంగుల పండుగ ఆనందోల్లాసాల మధ్య జరిగింది. అయితే, నీటి కొరత హైదరాబాదీలపై ప్రభావం చూపింది.
నిరుటి కన్నా హైదరాబాదులో రంగుల పండుగ కాస్తా కళ తప్పినట్లు కనిపించింది. రాష్ట్ర రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా రంగుల్లో మునిగితేలారు. యువతీయువకులు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు.
గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రంగుల హోలీని ఆనందించారు. ముఖ్యమంత్రిపై లంబాడీ స్త్రీలు రంగులు చల్లారు. గవర్నర్ నరసింహన్ పిల్లలతో రంగులు ఆడారు. గవర్నర్ దంపతులు రాజభవన్లో ఆనంద సముద్రంలో తేలియాడారు. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా గవర్నర్ను అభినందించడానికి రంగుల్లో తేలియాడారు.
సిఎం క్యాంప్ కార్యాలయంలో మాజీ మేయర్ బండా కార్తిక రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రంగులు రుద్దుతూ ఇలా..
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హోలీ వేడుకల్లో ఇలా...
పిల్లలలో హోలీ పండుగ జరుపుకుంటున్న గవర్నర్ నరసింహన్.
చిన్నారి ముఖానికి రంగులు రుద్దుతూ నరసింహన్.
బాలబాలికలతో గవర్నర్ ఇలా..
హోలీ రంగుల్లో తేలియాడుతూ గవర్నర్ దంపతులు.
గవర్నర్తో రాజభవన్లో హోలీ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ
హోలీ వేడుకల్లో గవర్నర్ దంపతులు...
రంగులు రాసుకుంటూ గవర్నర్ దంపతులు..
గవర్నర్తో బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ.
లంబాడీ స్త్రీలతో రంగులు రుద్దించుకుంటున్న ముఖ్యమంత్రి.
హోలీ సంబరాల్లో ముఖ్యమంత్రి ఇలా..
హోలీ రంగులు ఇలా ముఖ్యమంత్రికి రుద్దుతూ లంబాడీ స్త్రీలు.