వైయస్ నుండే మొదలు: జగన్పై బాబు, నాకే బాధెక్కువ

విద్యుత్ వ్యవస్థను నీరుగార్చారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి, కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు.. వీరివల్లే రాష్ట్రం అంధకారంలోకి నెట్టబడిందని ఆరోపించారు. పవర్ ప్రాజెక్టులకు ఇష్టానుసారంగా దోచిపెట్టారన్నారు. విద్యుత్ సమస్యపై తమ ఎమ్మెల్యేలు నిలదీస్తే ప్రభుత్వం కుంటిసాకులు చెప్పి తప్పించుకుందన్నారు. సభ నడుపలేక వాయిదా వేసి పారిపోయిందని ఎద్దేవా చేశారు.
టిడిపి హయాంలో నాణ్యమైన విద్యుత్ను తొమ్మిది గంటలు సరఫరా చేశామని, వైయస్ వచ్చి ఏడు గంటల ఉచిత్ విద్యుత్ అని చెప్పి విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. కిరణ్ కూడా అదే బాటలో నడుస్తున్నారన్నారు. ప్రయివేటు విద్యుత్ ప్రాజెక్టుల పట్ల కాంగ్రెసు ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందన్నారు. ప్రణాళికలు లేకుండా ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. మన రాష్ట్రంలో తయారవుతున్న విద్యుత్ ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తోందన్నారు.
ప్రణాళికలు లేకుండా ప్రభుత్వం నడుస్తోందన్నారు. అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయడంతోనే ప్రభుత్వ అసమర్థత అర్థమవుతోందన్నారు. నాణ్యమైన విద్యుత్ను ఒక్క టిడిపి మాత్రమే అందించిందన్నారు. కరెంట్ కష్టాలకు కారణమైన వారిని దోషులుగా నిలబెట్టాలన్నారు. విద్యుత్ సరిగా ఇవ్వకున్నా ప్రజల పైన ప్రభుత్వం రూ.32వేల కోట్ల భారం వేస్తోందని మండిపడ్డారు. ఎస్సెమ్మెస్తో సమస్య పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారని, ప్రభుత్వం ఎస్సెమ్మెస్తో పని చేసే పరిస్థితిలో ఉందా అన్నారు.
రాష్ట్రం తీరు చూసి అందరికంటే ఎక్కవగా బాధపడే వ్యక్తిని తానే అన్నారు. టిడిపి హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించామన్నారు. బిల్లులు కట్టినా పంటలు ఎండిపోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తమ హయాంలో విద్యుత్కు చాలా ప్రాధాన్యం ఇచ్చే వారమని, నిత్యం సమస్యలు తెలుసుకొని సమీక్షించే వాడినన్నారు. అప్పుడు జవాబుదారీతనం తీసుకు వచ్చానన్నారు. విద్యుత్ పైన ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వర్షాలు పడితేనే విద్యుత్ ఇస్తామని కిరణ్ విడ్డూరంగా మాట్లాడుతున్నారన్నారు. ఇరవై ఏళ్లలో ఇంత విద్యుత్ సంక్షోభాన్ని ఎప్పుడు చూడలేదన్నారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే'












Click it and Unblock the Notifications