రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీతపై రేప్ కేసు

సతారాకు సమీపంలోని జకత్వాడీలో గల ఆశ్రమ్ శాల (గిరిజన విద్యార్థుల ఆశ్రమ పాఠశాల)లో ఆ ముగ్గురు మహిళలు వంట మనుషులుగా పనిచేస్తున్నారు. పాఠశాలలో తమ ఉద్యోగాలను కన్ఫర్మ్ చేస్తానని చెప్పి తమపై అత్యాచారం చేశాడని వారు ఆరోపించారు. పాఠశాలకు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాడు.
పెళ్లిళ్లు చేసుకున్న ముగ్గురు మహిళల వయస్సు 30, 35 మధ్య ఉంటుంది. మానే తమపై 2003, 2010 మధ్య కాలంలో అత్యాచారం చేశాడని వారు ఆరోపించారు. మానే నివాసం సతారా ఉంది. పూణేలో ఓ అతిథి గృహం ఉంది.
తాము మానేను పట్టుకోవడానికి ఇంటికి వెళ్లామని, అతను ఎక్కువగా వెళ్లే చోట్లకు కూడా వెళ్లామని, కానీ అతని జాడ కనిపించలేదని పోలీసులు అంటున్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని, అందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అదనపు పోలీసు సూపరింటిండెంట్ అమోల్ తాంబే చెప్పారు.
తన తండ్రిపై తప్పుడు కేసులు బనాయించారని, తమ తండ్రిపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, పాఠశాలకు చెందిన కొంత మంది తమ తండ్రిని తప్పుడు కేసుల్లో ఇరికించడానికి కుట్ర చేశారని మానే కుమారుడు భాయ్ అంటున్నారు. ఆయన భార్య శశితాయ్ కూడా ఆరోపణలను ఖండించారు.
మానేకు 1981లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2009లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. మానే పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని స్థానిక శివసేన, బిజెపి, ఇతర రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications