రాహుల్కి మోడీ పిజ్జా కౌంటర్: పవర్స్పై బాబు చెప్పారు
గత వారం సిఐఐలో ఆసక్తికరమైన ప్రసంగం చేసిన రాహుల్.. మోడీ ఒక్కడివల్లా ఏమీ కాదని, వ్యవస్థలు తయారు చేయనిదే ఏమీ జరగదని చురకలు అంటించారు. గతంలో రాహుల్ గాంధీ లోక్సభలో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన కళావతి అనే వితంతువు దీనగాథను, కష్టాలను పల్లె వేశారు. నిన్నటి సదస్సులో మోడీ మాత్రం తన రాష్ట్రంలోని జస్సుబెహన్ అనే మహిళ విజయగాధను వినిపించారు.
అహ్మదాబాద్లో జస్సుబెహన్ పిజ్జా చాలా ప్రాచుర్యం పొందిందని, పిజ్జాహట్ లాంటి పెద్ద కంపెనీల పిజ్జాల కంటే కూడా ఆమె తయారు చేసేవే కావాలని చాలామంది వెళ్తుంటారని చెప్పారు. జస్సూబెహెన్ పిజ్జాలకు పిజ్జా హట్లు పారిపోయాయన్నారు. ఇప్పుడిలా చెప్పానని ఆమె ఇంటర్వ్యూ కోసం పాత్రికేయులు వెళ్తారేమోనని, ఐదేళ్ల క్రితమే ఆమె చనిపోయారని చెప్పారు.
కానీ ఇప్పటికీ ఆ పిజ్జాలకు బోలెడంత మార్కెట్ ఉందని చెప్పారు. ఇక తానూ అందరిలాంటి సామాన్యుడినేనని, తనలోనూ లోపాలున్నాయని చెప్పారు. వాటిని సరిచేయాల్సింది మీరేనంటూ మహిళలను కోరారు. ఉన్న వ్యవస్థలను బాగా పనిచేసేలా చేయాలని, అవసరమైతే వ్యవస్థలను తగ్గించాలన్నారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనాన్ని తీవ్రంగా విమర్శించారు. తాను, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గతంలో రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని కోరామన్నారు.