జగన్ బయటకు రాడు: కోట్ల, అప్పుడే చెప్పా: శంకరన్న

వైయస్ వైఖరి నాడే తప్పు పట్టా.. శంకర రావు
బయ్యారం గనుల కేటాయింపు విషయంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని తాను అప్పుడే తప్పు పట్టానని మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకర రావు కరీంనగర్ జిల్లాలో అన్నారు. బయ్యారం గనుల కేటాయింపు తప్పన్నారు. దళిత ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు హోంశాఖ బాధ్యతలు అప్పగించాలన్నారు.
దళిత నేతకు హోంశాఖను ఎందుకివ్వరని ఆయన ప్రశ్నించారు. అవినీతి పైన తాను పోరాడం చేస్తున్నందుకే ముఖ్యమంత్రి తనను మంత్రిగా తప్పించారని, తప్పుడు కేసులు పెట్టించారని శంకర రావు ఆరోపించారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్న ముఖ్యమంత్రి మాటలతో కాంగ్రెసు పార్టీ ఓటు బ్యాంకుకు తెలంగాణలో గండి పడనుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications