జగన్ కేసులో ట్విస్ట్: నమ్మకద్రోహం అభియోగం కొట్టివేత

దానికి ముందు దాఖలు చేసిన చార్జిషీట్లలో జగన్, విజయసాయిరెడ్డిలపై ఆ అభియోగాలు అలాగే ఉన్నాయి. సెక్షన్ 409 నమ్మకద్రోహం కిందికి వస్తుంది. అలాగే, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్టు కింద నమోదు చేసిన అభియోగాన్ని కూడా కోర్టు తోసిపుచ్చింది. ప్రజాప్రతినిధులుగా ఉండి ఇతరులను ప్రభావితం చేసిన నేరానికి ఆ సెక్షన్ కింద అభియోగం మోపుతారు.
పిసీ యాక్ట్ సెక్షన్ 12 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వాధికారులు శ్రీలక్ష్మి, రాజగోపాల్ మీద మోపిన అభియోగాన్ని మాత్రం కోర్టు తోసిపుచ్చలేదు. ఆ అభియోగాలను కోర్టు తోసిపుచ్చడం వల్ల జగన్కు కొంత ఊరట లభిస్తుందని అంటున్నారు.
మిగతా నాలుగు చార్జిషీట్లలో మోపిన అభియోగాలపై జగన్ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. మిగతా నాలుగు చార్జిషీట్లలో ఆ సెక్షన్ల కింద మోపిన అభియోగాలను కూడా తోసిపుచ్చాలని కోరుతూ వారు హైకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తాజా పరిణామం వైయస్ జగన్ ఆస్తుల కేసులో కీలకమైన మలుపుగానే భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications